
గతంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. కొందరు అక్రమార్కులు కుట్రపూరితంగా ఈ ప్రచారం చేస్తున్నారని చెబుతూ బుద్ధి లేని వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. నేటి నుంచి రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో మొత్తం 5,500 కిలోమీటర్ల మేర పార్టీ ఆధ్వర్యంలో ‘విజయ సంకల్ప యాత్ర’ చేపట్టనున్నట్లు వివరించారు.
బీజేపీ శ్రేణులను ప్రజలు ఆశీర్వదించాలని, బహిరంగ సభలు ఉండవని, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తొలి సమావేశంలోనే తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ యాత్రలు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
20వ తేదీ నుంచి నాలుగు యాత్రలు సమాంతరంగా ప్రారంభమవుతాయని, అయితే మేడారం జాతర కారణంగా వరంగల్ యాత్ర కొన్ని రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలిపారు. యాత్రలో భాగంగా రైతులు, చేతివృత్తిదారులు, నిరుద్యోగులు, పొదుపు సంఘాల మహిళలు, అన్ని వర్గాల ప్రజలను కలుస్తామని చెప్పారు.
కేంద్రంలో మోదీ అవినీతి రహితపాలన అందిస్తున్నారని చెబుతూ దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పదేళ్లలో 4 కోట్ల ఇళ్లు కట్టించటం జరిగిందని పేర్కొన్నారు. దురదుష్టవశాత్తు తెలంగాణలో బీఆర్ఎస్ వైఖరి వల్ల ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదని ధ్వజమెత్తారు. నిరుపేదలు వైద్య కోసం ఇబ్బందులు పడకుండా కేంద్రం చర్యలు చేపడుతుందని చెప్పారు.
‘‘గతంలో తెలంగాణలో కేసీఆర్కుటుంబం ఖానా.. పీయా.. చెలేగయా.. ఇప్పుడు తెలంగాణ సంపదను దోచుకుని లోక్సభ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది’’ అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో టెర్రరిస్టులు, ఉగ్రవాదులు పెట్రేగిపోయారని మండిపడ్డారు. నేడు ఉగ్రవాదాన్ని మోదీ ఉక్కుపాదంలో అణచివేయటంతో దేశం ప్రశాంతంగా ఉందని తెలిపారు.
వచ్చే లోక్సభ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలనే విషయాన్ని జనాలు గమనించాలని కోరారు. పిల్లల, దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం మోడ్ మూడోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే. అరుణ, మాజీ ఎంపీ ఏపీ. జితేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.
More Stories
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!