
మరోవైపు, కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్ పార్టీ కూడా కూడా మిత్ర పక్షాలతో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఇమ్రాన్ బలపరిచిన అభ్యర్థులు 99 సీట్లలో విజయం సాధించారు. పీఎంఎల్-ఎన్ 71, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 53, ఇతర చిన్న పార్టీలు 27 స్థానాలను దక్కించుకున్నాయి. ఇంకా 15 సీట్లలో ఫలితం వెల్లడికావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఓటింగ్ ముగిసి 40 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రకటన రాలేదు.
ఇదిలా ఉండగా, తమ పార్టీ అగ్రనేత ఇమ్రాన్ ఖాన్ ఏఐ జనరేటెడ్ ప్రసంగాన్ని పీటీఐ పార్టీ విడుదల చేసింది. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించినట్లుగా ఆ వీడియోలో ఉంది. ‘మీ ఓట్ల వల్ల లండన్ ప్లాన్ విఫలమైంది. పాకిస్థానీ ప్రజలు ఆయన్ను (నవాజ్ షరీఫ్ను ఉద్దేశించి) విశ్వసించడం లేదు. మీ ఓటు శక్తిని ప్రతిఒక్కరూ చూశారు. ఇప్పుడు పోలింగ్ ఫలితాన్ని రక్షించుకోవాల్సి ఉంది. భారీగా నమోదైన పోలింగ్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. ఆయన పార్టీ 30 సీట్లలో వెనకబడి ఉన్నప్పటికీ విక్టరీ ప్రసంగం చేసిన తెలివితక్కువ నాయకుడు షరీఫ్’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణ విజయవంతమైదంటూ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు, ప్రజాస్వామ్యం ప్రజలకు సేవ చేయడానికేనని చెప్పారు. ‘స్వప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 25 కోట్ల మంది ప్రజల కోసం అరాచక పాలనకు దూరంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి’ అని వ్యాఖ్యలు చేశారు.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?