‘2023’ అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. ఈ రికార్డు దెబ్బకు గత రికార్డులన్నీ తుడుచుకు పోయాయి. మునుపటి రికార్డులతో పోలిస్తే 2023లో 1.48 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణం నమోదై పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన 1.5 డిగ్రీల థ్రెషోల్డ్కు చేరుకుంది. ఉష్ణోగ్రతల్లో 2016 వ సంవత్సరపు రికార్డును 2023 బద్దలుగొట్టి హాటెస్ట్ క్యాలెండర్ ఇయర్గా నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరగడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. భవిష్యత్తులో భూమి ఎదుర్కోబోతున్న విపత్తులకు ఇది నిదర్శనమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పర్యావరణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలకు ముప్పు వాటిల్లక తప్పదని సూచిస్తున్నారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98 డిగ్రీల కంటే 0.17 డిగ్రీలు అధికంగా రికార్డుల్లో నమోదయింది.
భూగోళం వేడుక్కుతోందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు, అంటార్కిక్ సముద్రపు మంచు కూడా రోజురోజుకు కరిగిపోతుంది. గతేడాది అంటార్కిటిక్ సముద్రపు మంచు ఎనిమిది వేర్వేరు నెలల్లో రికార్డుస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరిలో ఇది రికార్డు స్థాయికి చేరుకుంది. ఇంకోవైపు, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయులు కూడా పెరిగి 421 పీపీఎంకు చేరుకుంది.
ఇది 14 మిలియన్ సంవత్సరాలకంటే అధికం. దీంతో భూమి విపరీత స్థాయిలో వేడెక్కుతోందని, మంచు సైతం మరోవైపు కుచించుకుపోతోందని, ఇవన్నీ రాబోయే విపత్తులకు సూచనలని నిపుణులు చెబుతున్నారు.

More Stories
లక్నో వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు
భారత్లోనే నిఫా నిరోధక ‘యాంటీబాడీస్’ తయారీ
ఢిల్లీలో వాయు కాలుష్యం.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు