లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని అబ్బురపరిచే సాహసకృత్యాలు

లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని అబ్బురపరిచే సాహసకృత్యాలు
రెండు రోజుల పర్యటనలో భాగంగా లక్షద్వీప్‌లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహసోపేతమైన స్నార్కెలింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్వాస తీసుకునేందుకు ట్యూబ్‌తో (స్నార్కెల్) అనుసంధానించిన డైవింగ్ మాస్క్‌ను ధరించి సముద్ర జలాల్లో ఆయన స్విమ్మింగ్ చేశారు. 
స్నార్కెలింగ్‌ (సముద్ర గర్భంలో ఈత) విధానంలో తల సహా పూర్తి శరీరాన్ని నీళ్లలో ఉంచి, ముఖాన్ని కిందికి ఉంచి స్విమ్మింగ్ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటూ  ఇదో అద్భుతమైన అనుభవమని ఆయన తెలిపారు. ఒక ట్వీట్‌లో తాను స్నార్కెలింగ్‌ చేసిన ఫొటోలను పంచుకున్నారు.
సముద్ర జల చరాల ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. మరో ట్వీట్‌లో షేర్ చేసిన ఫొటోలలో ప్రధాని మోదీ ప్రశాంతంగా సేదతీరుతూ కనిపించారు. తెల్లటి కుర్తాలో కనిపించగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇసుక, సముద్రపు నీళ్లు ఆహ్లదకరంగా ఆకట్టుకున్నాయి. తెల్లటి చెప్పులు ధరించి బీచ్‌లో అటు ఇటు సరదాగా షికారు చేశారు.

‘‘సాహసాలు చేయాలనుకునేవారు లక్షద్వీప్‌ను మీ జాబితాలో చేర్చుకోండి. నా విడిది సమయంలో స్నార్కెలింగ్‌ని ప్రయత్నించాను. ఇది నిజంగా అద్భుతమైన అనూభూతి!’’ అంటూ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత కూడా మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింతగా కష్టపడి ఎలా పని చేయాలో లక్షద్వీప్ ఆలోచన కలిగించింది’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

 సముద్ర గర్భం కింద ఉండే రాళ్లు, ఇసుక దిబ్బలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. సూర్యోదయాన అందమైన బీచ్‌లో తాను సాగించిన నడకను, అప్పుడు లభించిన ప్రశాంతతను కూడా ఆయన వివరించారు. అగట్టి, బంగారం, కవరట్టి దీపాల వాసులను కూడా కలుసుకున్నానని తెలియచేస్తూ వారి ఆతిథ్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

తన లోద్వీప్ పర్యటన ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుని, నేర్చుకునే అవకాశాన్ని కల్పించిందని ఆయన పేర్కొన్నారు. లక్షద్వీప్ అనేది కేవలం కొన్ని ద్వీపాల సమూహం మాత్రమే కాదని, కాలాతీత సాంపద్రాయ వారసత్వమని, అక్కడి ప్రజల స్ఫూర్తికి నిత్య పరీక్ష అని ఆయన తెలిపారు. 

మరింత అభివృద్ధిగా చేయడం, మెరుగైన ఆరోగ్య రక్షణ కోసం అవకాశాలు కల్పించడం, వేగవంతమైన ఇంటర్‌నెట్ సౌకర్యం,ద్వారా లక్షద్వీప్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు అదే సమయంలో వారి స్థానిక సంస్కృతిని పరిక్షించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్షమని ప్రధాని తెలిపారు. లక్షద్వీప్‌లో రూ. 1,150 కోట్లతో తాను ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఇదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని మోదీ వివరించారు.