హర్యానాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న చలిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లిలో గత 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 8.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ను ఆదివారం ఉదయం పొగమంచు కమ్మేసింది. రేవా, సత్నా జిల్లాల్లో రికార్డుస్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ అధికారులు తెలిపారు. అటు జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తున్నది. హిమపాతం కప్పేసింది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా సింథాన్ టాప్ మీదుగా వెళ్లే కిష్త్వార్- అనంత్నాగ్ రహదారిని మూసివేశారు.
శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్ 3 డిగ్రీలకు పడిపోయాయి. అనంతనాగ్లో ఉష్ణోగ్రత 0.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. జమ్మూకాశ్మీర్లో చలికి ఇప్పటికే ప్రముఖ దాల్ సరస్సుతోపాటు నదుల్లో నీరు గడ్డకట్టింది. హిమాచల్ప్రదేశ్లోని అటల్ టన్నెల్ రెండు చివరలను మంచు కప్పేసింది.
దీంతో వాహనాల రాకపోకలకు అటల్ టన్నెల్ను మూసేశారు. కులు, లాహౌల్, స్పితి, చంబా ప్రాంతాల్లో హిమపాతం కురిసింది. రోహ్తంగ్ పాస్తోపాటు సిస్సు, బరాలాచా, కుంజమ్పాస్, కోక్సర్తో సహా పలు ప్రాంతాల్లో దట్టంగా హిమపాతం కురుస్తున్నది. పశ్చిమబెంగాల్, ఒడిశాలోనూ పొగమంచు కురుస్తోంది. దీంతో చలి తీవ్రత కూడా పెరిగింది.
ఆయా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఉదయగిరిలో కనిష్ట ఉష్ణోగ్రత 5.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
ఒడిశాలోని పూరీ, గంజాం, కలహండి, కోరాపట్ సహా 14 జిల్లాల్లో ఆదివారం కూడా పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహు కోరారు. రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరిగింది. జీ ఉదయగిరి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 5.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
More Stories
మూడు ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం