
టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ దంపతులు మరో అరుదైన ఘనత సాధించారు. తాజాగా వీరిద్దరూ ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. అయితే ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించలేదు. మొదటిసారి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు రామ్ చరణ్ దంపతులు.
అందరూ హీరోలు తమ సినిమాలతో బిజీగా ఉంటే రామ్ చరణ్ మాత్రం నేషనల్ వైడ్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అందుకు కారణం ఏంటంటే కొద్దిరోజులుగా చరణ్ తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో దేశంలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ దంపతులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను కలిశారు.
ఈ సందర్భంగా షిండే వారిని సత్కరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై సైలీష్ లుక్ లో కనిపించి వావ్ అనిపించారు. ఈ చిత్రంలో ఉపాసన సోఫాలో కూర్చోగా, రామ్ చరణ్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చోడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ నెట్టింట వైరల్ అవుతుంది.
ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ ఫొటో షూట్ జరుగగా సూపర్ కపుల్ అంటూ కవర్ పేజీపై క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలో పింక్ కలర్ డిజైనర్ డ్రెసుల్లో చరణ్, ఉపాసన ఎంతో అందంగా కనిపిస్తున్నారు. రామ్ చరణ్. ఉపాసనల లవ్ స్టోరీ, వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు. క్లీంకార వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ మెగా జంట.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామారాజు పాత్రలో అద్భతంగా నటించిన చరణ్ రేంజ్ ను అమాంతం పెంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఆనయతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి