ఒడిశాకు చెందిన డిస్టలరీ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖా అధికారులు గత పదిరోజుగా చేస్తున్న సోదాలు శనివారం ముగిసాయి. ఈ కంపెనీని కాంగ్రెస్ ఎంపి ధీరజ్ సాహు కుటుంబం నిర్వహిస్తోంది. ఈ నెల 6 నుంచి 15 వరకు పదిరోజులపాటు కొనసాగిన తనిఖీల్లో రూ.351 కోట్ల నగదు, మూడు కిలోల బంగారం పట్టుబడింది. దేశంలో ఇప్పటివరకు పట్టుబడిన నగదు నిల్వల్లో ఇదే పెద్ద మొత్తం కావడం విశేషం.
కాగా, ఐటీ దాడుల విషయమై ధీరజ్ సాహు తొలిసారిగా నోరువిప్పారు. పట్టుబడిన సొమ్ము తనది కాదని, తమ కుటుంబానికి చెందిందని పేర్కొన్నారు. తమది కుటుంబ వ్యాపారమని, అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు. ఆ డబ్బుతో కాంగ్రెస్కుగానీ, మరే రాజకీయ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
‘ఐటి అధికారులు పట్టుకున్న డబ్బు మొత్తం మద్యం విక్రమాలకు సంబంధించిన డబ్బే. కానీ ఈ డబ్బుకు కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇతర ఏ రాజకీయ పార్టీలకు కానీ సంబంధం లేదు. పట్టుకున్న డబ్బు అంతా నాది కాదు. నా కుటుంబ సభ్యులది, ఇతర సంబంధిత సంస్థలకు చెందినది. నేను నా అకౌంట్ వివరాల్ని ఐటి కంపెనీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, డిస్టిలరీ కంపెనీని ధీరజ్ సాహు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఐటి అధికారులు దాడులు నిర్వహించినప్పుడే చెప్పారు. ఈ దాడుల్లో 176 బ్యాగుల్లో ఉన్న డబ్బును అధికారులు లెక్కించారు. మొత్తం రూ. 351 కోట్ల నగదు లెక్క తేలినట్లు ఐటి అధికారులు వెల్లడించారు. ధీరజ్ సాహు వద్ద అన్ని కోట్ల డబ్బు పట్టుబడడంపై బిజెపి నేతలు తీవ్రంగా విమర్శించారు.

More Stories
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం