ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్ డి ఆర్ ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్ డి ఆర్ ఎఫ్) బృందాలు చెన్నైలో మోహరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి.
దీంతో ప్రమాదకర స్థాయిని మించి నీరు ప్రవహిస్తున్న దృష్ట్యా బేసిన్ బ్రిడ్జ్ – వ్యాసర్పాడి మధ్య ఉన్న బ్రిడ్జి నెంబర్ 14ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వంతెన మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు.
చెన్నై – మైసూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్, కోయంబత్తూరు – కోవై ఎక్స్ప్రెస్, కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్ప్రెస్, కెఎస్ఆర్ బెంగళూరు ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, కెఎస్ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్ప్రెస్, తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్లను సోమవారం రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు.
చెన్నైలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరుకున్నది. పుదుచ్చేరిలోని తీర ప్రాంతంలో 144వ సెక్షన్ను విధించారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు తీరం వెంట నిషేధం విధించారు.
ఐఎండీ ప్రకారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో 100 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వలసరవక్కంలో 154.2 మి.మీటర్ల వర్షంపాతం నమోదు కాగా, నుంగంబాక్కంలో 101.7 మి.మీ, షోలింగనల్లూర్లో 125.7 మి.మీ, కోడంబాక్కంలో 123.3 మి.మీ, మీనంబాక్కంలో 108 మి.మీ వర్షపాతం నమోదైంది.
More Stories
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
కాశ్మీర్ లో పోలింగ్కు ముందు రెచ్చిపోయిన ఉగ్రవాదులు
దక్షిణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు