ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య అధికారం కోసం జరుగుతున్న పోరును ప్రధాని ప్రస్తావిస్తూ‘ క్రికెట్లో ఒక బ్యాటర్ వచ్చి తన జట్టు కోసం పరుగులు చేస్తాడు. అయితే కాంగ్రెస్లో మాత్రం బోలెడంత అంతర్గత పోరు ఉంది.ఎంతంటే పరుగులు చేయడానికి బదులు ఆ పార్టీ నేతలు ఒకరినొకరు రనౌట్ చేయడానికి అయిదేళ్లు గడిపారు’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి మంచి ఉద్దేశాలు ఉండవని, వాటి మధ్య ఉండే సంబంధం వెలుగు, చీకటి మధ్య ఉండే సంబంధం లాంటిదని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేపర్ లీక్ మాఫియా లక్షల రూపాయల కోసం యువకుల భవిష్యత్తుతో ఆడుకుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల కుంభకోణానికి పాల్పడిందని, రైతులను దోచుకుందని కూడా ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక పేపర్ లీక్ కుంభకోణంపై వేగంగా దర్యాప్తు జరిపిస్తుందని ప్రధాని చెప్పారు. ఎంతగొప్పవాళ్లనయినా వదిలిపెట్టబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఝున్ఝున్లో జరిగిన మరో సభలో ప్రధాని మాట్లాడుతూ అన్ని రంగాల్లో భారత్ అద్భుతాలు చేస్తోందని, అన్ని రంగాల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోందని చెప్పారు.
2047నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చేస్తామన్న విశ్వాసం ఉందని ప్రధాని చెప్పారు. రాజస్థాన్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని మోదీ జోస్యం చెప్పారు. రాజస్థాన్లో అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలు, దళితులపై అత్యాచారాలు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు.
More Stories
‘ఎగ్జిట్ పోల్స్ డిబేట్’లకు తోక ముడిచిన కాంగ్రెస్
ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల పోలీసు కస్టడీ
45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ