ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను అమెరికా పేర్కొన్నారు. జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా రక్షణ తయారీ రంగంలో ఇరు దేశాల మధ్య పలు ముఖ్యమైన ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా భారతీయ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కలిసి అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లను తయారు చేయనుంది.
జనరల్ ఎలక్ట్రిక్ సంయుక్తంగా యూఎస్ కాంగ్రెస్లో ఫైటర్ ఇంజిన్లను తయారు చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం జనరల్ ఎలక్ట్రిక్ కు అనుమతులు ఇచ్చిందని డీఆర్డీవో చీఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్-414 జెట్ ఇంజిన్లను తయారీ చేయనున్నది.
రెండు కంపెనీలు కలిసి భారతదేశంలో 99 ఇంజిన్లను తయారు చేయనున్నాయి. దీని ధర బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఎల్సీఏ ఎంకే-2ను సిద్ధం చేయానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్కు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అంచనా.

More Stories
అమెరికాలో రిలయన్స్ 300 బిలియన్ డాలర్లతో ఆయిల్ రిఫైనరీ
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బెర్స్ రాజీనామా
హార్ముజ్ ప్రాంతంలో భారత్ నౌకలకు రూ. 10 వేల కోట్ల నష్టం!