కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని ‘సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ’ సంస్థ ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఐప్యాక్ మాజీ ఉద్యోగులను ఉపయోగించుకుని ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్చుతున్నారని పిటిషన్లో ఆరోపించారు.
ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఫ్రొపైలింగ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సంస్థలకు రూ.68 కోట్ల ప్రజాధనాన్ని ధారపోసినట్లు నిమ్మగడ్డ తన పిటిషన్లో వెల్లడించారు.
ఓటర్ల నమోదులో ఏపీ ప్రభుత్వం యధేచ్చగా జోక్యం చేసుకుంటోదంటూ ఆరోపించారు. ఓటర్ల నమోదులో గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్యదర్శులను భాగస్వాములను చేయడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
మొంథా తుపాను ప్రాథమిక నష్టం రూ.5265 కోట్లు