కాగా, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించిన కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ను అక్టోబర్ 30న ఈడీ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన కుమారుడ్ని ఈడీ ప్రశ్నించడం రాజకీయ ప్రతీకార చర్య అని అశోక్ గెహ్లాట్ విమర్శించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించాయి.
రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ డోటాస్ర కుమారులు అభిలాశ్, అవినాశ్లకు ఈడీ సమన్లు ఇచ్చింది. గోవింద్ విద్యా శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ల లీకేజ్ కేసులో విచారణకు ఈ నెల 7, 9 తేదీల్లో హాజరు కావాలని ఆదేశించింది. గత నెల 26న ఈ తండ్రీకొడుకుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. స్వతంత్ర ఎమ్మెల్యే (ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి) ఓం ప్రకాశ్ హుడియాపై కూడా ఈడీ దృష్టి సారించింది.
More Stories
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం
వచ్చేనెల పిఎం కిసాన్ నిధులు విడుదల
ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జిషీట్లో ఆప్ పేరు