భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ఓ వలస కార్మికుడిని దారుణంగా హతమార్చారు. సరిహద్దు భద్రతా దళ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ కి చెందిన ముఖేష్ వలస కార్మికుడు జమ్మూ కశ్మీర్ లో పని చేస్తున్నాడు.
పుల్వామాలో విధుల్లో ఉండగా అకస్మాత్తుగా ఉగ్రవాదులు ఆయన ఉన్న ప్రాంతంపై తుపాకులతో విరుచుకుపడ్డారు. ముఖేష్ ని బంధించి కళ్లు, పొట్ట, మెడపై మూడు సార్లు కాల్పులు జరిపారు. దాడిని గుర్తించిన భద్రతాదళ సిబ్బంది వారిపై ఎదురు దాడికి దిగారు. రెండు వైపుల జరిగిన కాల్పులతో సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

More Stories
ఉరిలో చొరబాటు యత్నం భగ్నం..ఉగ్రవాది ఖతం!
శబరిమలలోకి మహిళల ప్రవేశంపై కేరళ ఆంక్షలు
రుతుస్రావ సెలవుల చట్టం మహిళ ఉపాధికే అడ్డంకి