ఇరాక్, సిరియాలో ఐసిస్తో పోరాడుతున్న అంతర్జాతీయ సంకీర్ణ కూటమిని హమాస్తో పోరాడేందుకు విస్తరించాలని ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ మంగళవారం పిలుపు ఇచ్చారు. పాలస్తీనా శాంతి ప్రక్రియను నిర్ణాయక దశకు తీసుకువచ్చేందుకు పునరుద్ధరించాలని కోరారు.
మీరు ఏకాకులు కాదని సంయుక్త విలేకరుల సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి మాక్రాన్ పేర్కొన్నారు.
ఐసిస్తో పోరాడుతున్న దేశాలు హమాస్పై కూడా పోరాడాలని కోరారు. ఉగ్ర సంస్ధపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించడం, ఇజ్రాయెల్ పౌరుల పట్ల హమాస్ వేధింపుల నేపధ్యంలో పాలస్తీనా శాంతి ప్రక్రియను నిర్ణాయక దశకు చేర్చేందుకు ఈ ప్రక్రియను పునరుద్ధరించాలని కోరారు.
హమాస్పై ఇజ్రాయెల్ పోరుకు ఫ్రాన్స్ బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఫ్రాన్స్ ఇజ్రాయెల్కు తన మద్దతును పునరుద్ఘాతీస్తూ ఇరాక్, సిరియాలలో ఇస్లామిక్ స్టేట్కు వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ సంకీర్ణ పోరాటాన్ని హమాస్పై కూడా పోరాడేందుకు విస్తరించవచ్చని ప్రతిపాదించింది.
“హమాస్కు వ్యతిరేకంగా పోరాడటానికి ఇరాక్, సిరియాలో కార్యకలాపాల కోసం మేము పాల్గొంటున్న దాష్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సంకీర్ణానికి ఫ్రాన్స్ సిద్ధంగా ఉంది” అని జెరూసలెంలో మాక్రాన్ ప్రకటించారు. అంతకుముందు, ఇస్లామిక్ మిలిటెంట్లపై పోరాటంలో ఫ్రాన్స్ ఇజ్రాయెల్ను ఒంటరిగా వదిలివేయదని అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్కు మాక్రాన్ హామీ ఇచ్చారు.
ప్రాంతీయ సంఘర్షణ ప్రమాదాల గురించి కూడా మాక్రాన్ హెచ్చరించిగా, హమాస్ గెలిస్తే “అందరూ ప్రమాదంలో పడతారు” అని నెతన్యాహు తెలిపారు. “హమాస్పై మనం నిర్ణయాత్మక విజయం సాధించాలి,” అన్నారాయన. ఈ యుద్ధం మధ్యప్రాచ్యం, అరబ్ ప్రపంచం హృదయం, ఆత్మ కోసం అని నెతన్యాహు స్పష్టం చేశారు.
లెబనాన్ యుద్ధంలో చేరాలని నిర్ణయించుకుంటే “భయంకరమైన పరిణామాలు” ఉంటాయని ఈ సందర్భంగా హిజ్బుల్లాను హెచ్చరించారు. బందీల పరిస్థితి విషయంలో, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ ఒకే దుఃఖాన్ని పంచుకుంటున్నాయని చెబుతూ హమాస్ చేతిలో ఉన్న బందీలందరినీ విడుదల చేయాలని మాక్రాన్ కోరారు. “ఉగ్రవాదంపై దయ లేకుండా, నిబంధనలతో పోరాడాలి” అని ఆయన పిలుపిచ్చారు.
కాగా, గాజాలో మిలిటెంట్ గ్రూప్ హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. 400 మిలిటెంట్ టార్గెట్లపై ఫోకస్ చేస్తూ దాడులను తీవ్రతరం చేసింది. సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్న దాడుల్లో డజన్ల కొద్దీ హమాస్ ఫైటర్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
వీరిలో ముగ్గురు డిప్యూటీ బెటాలియన్ కమాండర్లు ఉన్నారని వెల్లడించింది. సముద్రం నుంచి సొరంగ మార్గం ద్వారా ఇజ్రాయెల్లోకి చొచ్చుకువచ్చేందుకు హమాస్కు సహకరించే టన్నెల్తో పాటు మసీదుల్లో హమాస్ కమాండ్ సెంటర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. మరోవైపు హమాస్తో యుద్ధంలో భాగంగా గాజా స్ట్రిప్పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇప్పటివరకు 5,700 మంది పాలస్తీనియన్లు మరణించారు.
More Stories
కాంగ్రెస్ వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం.. అందుకే 400 సీట్లు
హైదరాబాద్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీవర్షం
సికింద్రాబాద్లో పలు విభాగాల్లో అగ్నివీర్ ఎంపికలు