తెలంగాణాలో బీసీలకు బిజెపి 35 నుండి 40 సీట్లు

తెలంగాణాలో బీసీలకు బిజెపి 35 నుండి 40 సీట్లు
టిక్కెట్ల కేటాయింపులో బీసీ నేతలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ విఫలమైన్నట్లు బిజెపి  ఎంపీ, ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు డా. కే లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌కు బీసీ ఓట్లు మాత్రమే కావాలి, సీట్లు ఇవ్వదని పేర్కొంటూ బీఆర్‌ఎస్ 23 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. 
 
అయితే, రానున్న తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ 35 నుంచి 40 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దించుతుందని ఆయన ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో బిజెపి సామాజిక న్యాయం పాటిస్తుందని లక్ష్మణ్ చెప్పారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్ద పీట వేశామని.. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు.
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు వేలంలో పాల్గొన్నట్లుగా ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయన్న లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ అనేక హామీలు ఇచ్చిన కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఎలాంటి పరిస్థితి ఉందో చూస్తున్నామని ధ్వజమెత్తారు.  తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందుని ఆయన ప్రజలను హెచ్చరించారు.
బీసీని ప్రధానమంత్రిని చేసి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, 27 మంది కేంద్రమంత్రులుగా నియమించి బీసీల అనుకూల పార్టీగా బీజేపీ పదే పదే రుజువు చేసిందని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలోని ఐదుగురు ఎంపీల్లో ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం బీసి సమాజం బిజెపి వైపు చూస్తోందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. 

విద్యాసంస్థలు, ఎంబీబీఎస్, ఎండీ ప్రోగ్రామ్‌లు, సైనిక్ స్కూల్స్, ఇతర విద్యాసంస్థల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదేనని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఏఐఎంఐఎం ఒకే రెక్కల పక్షులని పేర్కొన్న లక్ష్మణ్, ప్రతిపక్షాల పొత్తుపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఢిల్లీలో చర్చలు జరిగాయని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయని స్పష్టం చేశారు.
 
 “బీఆర్‌ఎస్ అధికార వ్యతిరేక ఓటును చీల్చాలనుకుంటోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను కేసీఆర్ జాక్‌తో ఎత్తేస్తున్నారు. అందుకే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సాయం చేసేందుకు కేసీఆర్ భారీగా ఖర్చు చేశారు” అని ఆరోపించారు. మహిళలకు సీట్ల విషయంలో బిఆరఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని చెబుతూ దేశ రాజధాని ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నాలు చేశారు.. కానీ మహిళలకు సీట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
 
కాగా, 2-3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒకే సభతో బహిరంగ సభలు నిర్వహించేందుకు బిజెపి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సభలలో  కేంద్ర నేతలు పాల్గొంటారని చెప్పారు. గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను రద్దు చేయాలా వద్దా అనే దానిపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
 
 “రాజా సింగ్‌ను గోషామహల్ నుంచి మళ్లీ పోటీ చేసేందుకు అనుమతించాలని ఆయన మద్దతుదారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మేము కేంద్ర నాయకత్వానికి తెలియజేశాము. త్వరలోనే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది” అని లక్ష్మణ్ చెప్పారు.