వార్షిక ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్లో భాగంగా స్విస్ బ్యాంక్లోని భారతీయ పౌరుల, సంస్థల బ్యాంక్ ఖాతాల గురించి భారత ప్రభుత్వానికి సమాచారం అందింది. దీని కింద స్విట్జర్లాండ్ దాదాపు 36 లక్షల ఆర్థిక ఖాతాల వివరాలను 104 దేశాలతో పంచుకున్నట్లు నివేదించింది. భారత్, స్విట్జర్లాండ్ మధ్య సమాచార మార్పిడి జరగడం ఇది ఐదవసారి కావడం గమనార్హం.
కొంతమంది వ్యక్తులు, కార్పొరేట్లు, ట్రస్టులతో అనుబంధించన అనేక ఖాతాల కేసులతో సహా, భారత అధికారులతో పంచుకున్నారు. వారు అందించిన సమాచారంలో పేరు, చిరునామా, నివాస దేశం, పన్ను గుర్తింపు సంఖ్యతో సహా గుర్తింపు, ఖాతా, ఆర్థిక సమాచారం, అలాగే నివేదించే ఆర్థిక సంస్థ, ఖాతా బ్యాలెన్స్, మూలధన ఆదాయానికి సంబంధించిన సమాచారం ఉన్నాయి. సమాచార మార్పిడి గోప్యత నిబంధన వల్ల అధికారులు వెల్లడించలేదు.
అయితే, మనీలాండరింగ్, టెర్రర్ ఫండింగ్తో సహా అనుమానిత పన్ను ఎగవేత, ఇతర తప్పుడు పనుల దర్యాప్తులో డేటా విస్తృతంగా ఉపయోగించబడుతుందని అధికారులు నొక్కి చెప్పారు. మార్పిడి గత నెలలో జరిగింది. తదుపరి సమాచారాన్ని స్విట్జర్లాండ్ సెప్టెంబర్ 2024లో పంచుకుంటుందని అధికారులు తెలిపారు.
మార్పిడి సమాచారం పన్ను చెల్లింపుదారులు తమ పన్ను రిటర్నులలో తమ ఆర్థిక ఖాతాలను సరిగ్గా ప్రకటించారో లేదో ధృవీకరించడానికి పన్ను అధికారులు పరిశీలించనున్నారు. స్విస్ రాజధాని బెర్న్ నుంచి ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో, ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో గ్లోబల్ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్లో 104 దేశాలతో ఆర్థిక ఖాతాల సమాచారాన్ని మార్పిడి చేసుకున్నట్లు తెలిపింది.
ఈ సంవత్సరం, కజకిస్తాన్, మాల్దీవులు, ఒమన్లు మునుపటి 101 దేశాల జాబితాలో చేర్చాలు. ఆర్థిక ఖాతాల సంఖ్య దాదాపు రెండు లక్షలు పెరిగింది. స్విస్ బ్యాంక్ అందించిన తాజా జాబితాలో మొత్తం 104 దేశాలకు చెందిన 36 లక్షల ఖాతా వివరాలు ఉన్నట్లు తెలిసింది.
More Stories
ఎయిర్ఇండియా సిబ్బంది సమ్మె విరమణ
ఎస్బీఐకి 3 నెలల్లో రూ.20,698 కోట్ల లాభం
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు!