
మేనిఫెస్టోఅండ్పబ్లిసిటీకమిటీచైర్మన్గావివేక్వెంకటస్వామిని,కన్వీనర్గామహేశ్వర్రెడ్డి,జాయింట్కన్వీనర్గాకొండావిశ్వేశ్వర్రెడ్డిని; హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించారు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా వదిరే శ్రీరామ్, ఎస్సీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా జితేందర్ రెడ్డి, ఎస్టి నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా గరికపాటి మోహన్ రావును తెలంగాణ బిజెపి నియమించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీల్ని ప్రకటించింది బీజేపీ. ఇందులో భాగంగా. రాజగోపాల్రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. పబ్లిక్ మీటింగ్ కమిటీ ఇంఛార్జ్గా బండి సంజయ్, మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్ వెంకటస్వామి, ఛార్జ్షీట్ కమిటీ చైర్మన్గా మురళీధర్రావులను ఎంపిక చేసింది.
వీటితో పాటు నిరసనలు, ఆందోళన నిర్వహణల కమిటీ చైర్మన్ గా విజయశాంతి, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిషన్ వ్యవహారాల కమిటీ చైర్మన్గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్, సోషల్ ఔట్రీచ్ కమిటీ కన్వీనర్గా ఎంపీ లక్ష్మణ్, మీడియా కమిటీ కన్వీనర్గా ఎమ్మెల్యే రఘునందనరావులకు బాధ్యతలు అప్పజెప్పారు. పార్లమెంట్,అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు ప్రణాళిక రచిస్తున్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి