100 బృందాలతో ఐటీ అధికారుల సోదాలు

హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన పలువురు వ్యాపారవేత్తల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దాదాపు 100 బృందాలతో ఈ తనిఖీలు చేపట్టారు.  హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. 
 
జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ సోదరుల నివాసంతో పాటు వ్యాపారవేత్తలు ప్రసాద్‌, కోటేశ్వరరావు, రఘువీర్‌, వజ్రనాథ్‌ ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా కూకట్‌పల్లిలోని హిందూ ఫార్చ్యూన్‌లో కూడా అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి.

ఇ-కామ్ సంస్థ నిర్వాహకుడు రఘువీర్ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రఘువీర్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టారు. గత ఐదేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్నులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఐటీ శాఖ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ రిటర్నులపై అనుమానాలు వ్యక్తం కావడంతో వాటిని నివృత్తి చేసుకుంటున్నారు.

ఎల్లరెడ్డగూడలోని వ్యాపారి మాగంటి వజ్రనాథ్‌ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందూ ఫార్చూన్‌లో కూడా ఐటీ బృందాలు సోదాలు జరుగుతున్నాయి. పదిమంది బడా కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రసాదరావు, రఘువీర్‌, కోటే‌శ్వరరావు, రఘు అనే వారి ఇళ్ళలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. 

పన్నుల ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అటు తమిళనాడులో కూడా డిఎంకె ఎంపీ జగద్రక్షన్‌ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నై, వేలూరు, అరక్కోణం, కోయంబత్తూరు ప్రాంతాల్లో ఉన్న జగద్రక్షన్ కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. దాదాపు 150మంది ఐటీ సిబ్బంది 70ప్రాంతాల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టింది.