సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమిసిపోకముందే మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉదయనిధి సోదరి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమార్తె సెంథామరై ఓ హిందూ ఆలయంలో పూజలు చేయడం అందరి దృష్టిని ఆకట్టుకొంటున్నది.
మైలాడుతురై జిల్లా సిర్కాజీలోని సత్తైనాథర్ ఆలయాన్ని సెంథామరై స్టాలిన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కళ్లకు అద్దుకుని, కుంకుమ బొట్టు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై పలువురు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘మరి దీన్ని ఏమంటారు..?, ఇది సనాతన ధర్మం కాదా..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సనాతన ధర్మంపై అనుచితవ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మం” డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ వ్యాఖ్యానించారు.
ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఉదయనిధితోపాటు తమిళనాడు ప్రభుత్వం, సీబీఐ, తమిళనాడు పోలీసులు సహా 14 మందికి నోటీసులు కూడా జారీ చేసింది.
More Stories
పూంచ్ ఉగ్రదాడిలో పాక్ మాజీ కమాండర్
ఉద్రిక్తల నడుమ తొలిసారి మాల్దీవుల విదేశాంగ మంత్రి రాక
దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు