‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయాల పరంగా ముఖ్యమైన దేశం. భారత్తో దృఢమైన బంధాన్ని పెంపొందించుకునేందుకు మేము కట్టుబడి ఉన్నాం. మేం గతేడాదే మా ఇండో-పసిఫిక్ వ్యూహంతో ముందుకొచ్చాం. భారత్తో చట్టబద్ధ పాలనకు చాలా సీరియస్గా పనిచేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా నిజ్జర్ హత్య విషయంలో అమెరికన్లు తమతోనే ఉన్నారని ట్రూడో ప్రకటించారు. ఈ విషయంలో కెనడా, దాని మిత్రదేశాలు భారత్తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా, నిజ్జర్ హత్య విషయంలో వాస్తవాలను వెలికి తీసేందుకు తమతో కలిసి భారత్ పనిచేయాల్సిన అవసరం ఉందని ట్రూడో తెలిపారు.
అయితే ఈ విషయం వేరు , భారత్తో సంబంధాలు వేరని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ప్రగతిపథంలో దూసుకువెళ్లుతోందని, రాజకీయ భౌగోలిక అధికార కేంద్రమని విషయాన్నీ కాదనలేమని చెప్పారు. గత ఏడాదే తాము ఇండో పసిఫిక్ వ్యూహం ప్రకటించామని గుర్తు చేశారు. దీని మేరకు భారత్ తో సన్నిహిత సంబంధాలనే ఆశిస్తున్నట్లు కెనడా ప్రధాని తెలిపారు.
More Stories
ఇజ్రాయిల్ లో `అల్జజీరా’ కార్యాలయాల మూసివేత
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్