మావోయిస్టు అగ్ర‌నేత దీప‌క్‌రావు అరెస్టు

మావోయిస్టు అగ్ర‌నేత దీప‌క్‌రావు అరెస్టు
సీపీఐ మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్‌ దీపక్‌రావును అరెస్ట్ చేసిన్నట్లు డీజీపీ అంజనీ కుమార్  వెల్లడించారు. దీపకర్‌రావు పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారని, పలువురు అగ్రనేతలతో దీపక్‌రావు సమావేశాలు జరిపారని డీజీపీ పేర్కొన్నారు. 
 
కర్నాటక, తమిళనాడు, కేరళ ట్రైజంక్షన్‌ ఏరియాలో దీపక్‌రావు కీలకంగా ప‌నిచేశార‌ని అంజ‌నీకుమార్ చెప్పారు. దీపక్‌రావు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, రెండు మూడు రోజుల కిందట హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ట్టు డీజీపీ వెళ్ల‌డించారు.  ఆయన కోసం మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటక పోలీసులు గాలిస్తున్నారని, అలాగే ఎన్‌ఐఏ బృందాలు కూడా వెతుకుతున్నాయని తెలిపారు. దీపక్‌రావుపై మహారాష్ట్ర రూ.25లక్షల రివార్డ్‌ను ప్రకటించిందని పేర్కొన్నారు.
 
”పలువురు మావోయిస్టు అగ్రనేతలతో దీపక్‌రావు సమావేశాలు జరిపారు. పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ టైజంక్షన్‌ ఏరియాలో కీలకంగా వ్యవహరించారు. ఈఏడాది అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న దీపక్‌రావు రెండు..మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. కచ్చితమైన సమాచారంతో అరెస్టు చేశాం. అతని కోసం మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక పోలీసులు, ఎన్‌ఐఏ బఅందాలు గాలిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం దీపక్‌పై రూ.25లక్షల రివార్డు ప్రకటించింది” అని డీజీపీ వివరించారు.
ఇదిలా ఉండగా కేరళలో దీపక్‌రావును అనిల్‌, వికాస్‌ పేర్లతో పిలుస్తుంటారు. మహారాష్ట్ర థానే జిల్లా అంబర్‌నాథ్‌కు చెందిన దీపక్‌రావు గతంలో రెండుసార్లు అరెస్టయ్యారు. ధూలే, బెంగళూరులోనూ అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చారు. చాలాకాలం మహారాష్ట్రలో పనిచేసిన ఆయన 2019లో పాలకాడ్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత మణివాసగం మృతి తర్వాత 2020 నుంచి పశ్చిమ ఘాట్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.