ఏపీ మహిళా కమిషన్లో పేరుకు మాత్రమే తాము పదవిలో ఉన్నామంటూ గజ్జల లక్ష్మీ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. రెండేళ్లు మహిళా కమిషన్ సభ్యురాలి హోదాలో జాతీయ మహిళా కమిషన్ హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, దిల్లీ వంటి నగరాలతో పాటు విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యానని వీడియోల్లో వివరించారు.
ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లేందుకు ప్రతిసారీ విమాన టికెట్తో పాటు, ఇతర ఖర్చులు కలిపి రూ.50-60 వేల వరకు ఖర్చయిందని ఆమె తెలిపారు. సదస్సులు, సమావేశాలకు వెళ్లడానికి ప్రతిసారి సొంత డబ్బే ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్పారు. దాదాపుగా రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బిల్లులు బకాయిలున్నాయని ఆమె పేర్కొన్నారు.
తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశానని అయినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఖర్చులకు సంబంధించి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంతకం పెట్టకపోతే బిల్లులు చెల్లించడం కుదరదంటున్నారని ఆమె చెప్పారు.
అయితే, ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాత్రం బిల్లులపై సంతకాలు పెట్టడం లేదని ఆమె ధ్వజమెత్తారు. మహిళా కమిషన్లో పరిస్థితి ఇలా ఉంటే పార్టీలో మాత్రం మహిళా కమిషన్ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారని వీడియోలో ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
More Stories
రక్షణ, వాణిజ్య రంగాల్లో చైనా, రష్యా మరింత సహకారం
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట
కల్నల్ వైభవ్ కాలే మృతికి క్షమాపణలు చెప్పిన ఐరాస