
రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కేసీఆర్ ప్రభుత్వానికి పట్టుకుందని, అందుకే అన్ని వర్గాలను మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
అసెంబ్లీలో తమకు గది ఇవ్వకపోవడం. బిఎసికి పిలవకపోవడం అంటే తమను కాకుండా అసెంబ్లీని అవమానించడమే అంటూ ధ్వజమెత్తారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి కెసిఆర్ ప్రభుత్వానికి లేదని దయ్యబట్టారు. ‘గతంలో ఒక్క సభ్యుడు ఉన్నా బిఎసికి పిలిచేవారు. బిజెపి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా ఇప్పుడు పిలవడం లేదు. అసెంబ్లీలో చాలా రూములు ఖాళీగా ఉన్నా.. మాకు కేటాయించలేదు’ అని తెలిపారు.
స్పీకర్కు ఫోన్ చేసి అడిగినా జవాబు లేదని అంటూ తాము అసెంబ్లీ ఎదురుగా ఉన్న నిజాం క్లబ్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ మూడు రోజులే జరుగుతుందని అంటున్నారని అంటూ 6 నెలలకు ఒకసారి సభ జరగాలి కాబట్టి మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ వాటిపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందని ఈటెల తెలిపారు. వర్షాలకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో కలుపుతామని అంటున్నారని చెప్పారు.
అయితే, రోజురోజుకూ ఆర్టీసీ బస్సులను ప్రైవేటుపరం చేస్తున్నారని, చాలా మంది ఉద్యోగులను తొలగించారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను మభ్యపెట్టేందుకే విలీన ప్రకటన చేశారని రాజేందర్ ధ్వజమెత్తారు. 18 వేల మంది వీఆర్ఎ, వీఆర్వోలను వేరే విభాగాలకు పంపాలని చూస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నారని పేర్కొంటూ నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా? అని ఈటల ప్రశ్నించారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి