
అయితే గత ఏడాది సెప్టెంబరులో ఆమెకు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. దీంతో ఆమె జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు. తనకు సాధారణ బెయిలు మంజూరు చేయాలని తీస్తా సెతల్వాద్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు బెయిలు మంజూరు చేయవద్దని గుజరాత్ ప్రభుత్వం హైకోర్టును కోరింది.
తప్పుడు సాక్ష్యాలను సృష్టించినట్లు ఆమె ఆరోపణలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ నుంచి ఆమె రూ.30 లక్షలు తీసుకున్నారని తెలిపింది. 2002లో జరిగిన అల్లర్ల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే లక్ష్యంతో ఈ సొమ్మును ఆయన ఆమెకు ఇచ్చారని తెలిపింది.
గుజరాత్ను అపఖ్యాతిపాలు చేయాలనే లక్ష్యంతో ఓ రాజకీయ నేతకు పరికరంగా ఆమె వ్యవహరించారని ఆరోపించింది. గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, తదితరుల ప్రమేయం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే సుప్రీంకోర్టు జకియా పిటిషన్ను గత ఏడాది జూన్ 24న తోసిపుచ్చింది. ఆ మర్నాడే తీస్తా సెతల్వాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమీన్ వాదనలు వినిపిస్తూ, 2002లో గోద్రా రైలు దుర్ఘటన తర్వాత జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని ప్రచారం చేసేందుకు, అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు తీస్తా సెతల్వాద్, పోలీసు అధికారులు శ్రీకుమార్, సంజీవ్ భట్ కుట్ర పన్నారని ఆరోపించారు. ఆమెకు బెయిలు మంజూరు చేయరాదని కోరారు.
తీస్తా సెతల్వాద్ బెయిలు దరఖాస్తును గత ఏడాది జూలైలో సెషన్స్ కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. తీస్తాకు గతంలో సన్నిహితంగా వ్యవహరించిన రయీస్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రస్తావించింది. అహ్మదాబాద్ సర్క్యూట్ హౌస్లో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్, తీస్తా సెతల్వాద్ సమావేశమయ్యారని ఖాన్ ఈ స్టేట్మెంట్లో చెప్పినట్లు తెలిపింది.
కొందరిని కటకటాల వెనుకకు నెట్టే విధంగా చూడాలని సెతల్వాద్ను పటేల్ ఆదేశించినట్లు ఖాన్ చెప్పారని వివరించింది. పటేల్ ఆమెకు రూ.30 లక్షలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. తీస్తా మొదట్లో మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా తండ్రి విఠల్ భాయ్ పాండ్యాను సంప్రదించారని, అల్లర్లతో సంబంధం లేని వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయబోనని ఆయన చెప్పడంతో, ఆమె జకియా జాఫ్రిపై దృష్టి పెట్టారని తెలిపింది.
జస్టిస్ నిర్జర్ దేశాయ్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్తూ, తీస్తా సెతల్వాద్ బెయిలు దరఖాస్తును డిస్మిస్ చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది. అయితే ఈ తీర్పును 30 రోజులపాటు నిలిపివేయాలని సీనియర్ న్యాయవాది మిహిర్ ఠాకూర్ హైకోర్టును కోరారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్