చైనా జనాభా గతేడాది గరిష్టంకు చేరిందని, అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందని, భారత్ జనాభా మాత్రం పెరుగుతోందని జెఫెరీస్ చెప్పారు. భారత్ లో జనాభాలో ఏజ్ గ్రూప్ల శాతాన్ని యూఎన్ఎఫ్పీఏ డేటా వెల్లడించింది.
భారత జనాభాలో 0 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 25 శాతం, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 18 శాతం, 10 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు 26 శాతం ఉన్నారని ఆ డేటా వెల్లడించింది. ఇండియాలో 15 నుంచి 64 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారు 68 శాతం మంది ఉన్నారని, 65 సంవత్సరాలకు పైబడిన వారు జనాభాలో 7 శాతంగా ఉన్నారని తెలిపింది.
చైనా జనాభాలో 65 ఏళ్లు దాటిన వారు 20 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ పేర్కొంది. ఆయుర్దాయం (జీవితకాలం) విషయంలో భారత్ కంటే చైనా మెరుగ్గా ఉందని ఈ యూఎన్ఎఫ్పీఏ డేటా స్పష్టం చేసింది. చైనాలో మహిళల సగటు ఆయుర్దాయం 82 సంవత్సరాలుగా, పురుషుల ఆయుర్దాయం 76 ఏళ్లుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్ లో పురుషుల సగటు జీవితకాలం 74 సంవత్సరాలు, మహిళల ఆయుర్దాయం సగటున 71 ఏళ్లు ఉన్నట్టు వెల్లడించింది.
యువ జనాభా ఎక్కువగా ఉండడం భారత్కు చాలా సానుకూల అంశం అని, దేశాభివృద్ధికి ఇది చాలా తోడ్పడుతుందని యూఎన్ఎఫ్పీఏ డేటా పేర్కొంది. ఆర్థికంగా ఎదిగేందుకు కూడా భారత్ కు చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపింది. 2022లో చైనా జనాభా ఏకంగా 85 లక్షలు తగ్గింది. ఆ దేశ జనాభా ఈస్థాయిలో తగ్గడం 1961 తర్వాత ఇదే తొలిసారి. అయితే 2011 నుంచి భారతదేశ జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి నమోదవుతున్నదని తెలిపింది.
More Stories
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై అందరి దృష్టి
ఆప్ తనను `బిజెపి ఏజెంట్’ అనడంపై మండిపడ్డ స్వాతి మలివాల్
రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కార్