పోలీసుల వద్దే తన ఫోన్ ఉందని స్పష్టం చేస్తూ జైలు నుంచి విడుదల అయిన తర్వాత తన ఫోన్తో పోలీసులకు ఏం పని? అంటూ సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల దగ్గరే తన ఫోన్ ఉందని స్పష్టం చేస్తూ పోలీసుల మీదే తనకు అనుమానం ఉందని తెలిపారు. పైగా, తాను ఫోన్ అప్పచెప్పడం లేదని, విచారణకు సహకరించడం లేదని అంటూ పోలీసులు కోర్టులలో ఫిర్యాదు చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
టీఎస్పీఎస్సీ లీకేజీపై న్యాయమూర్తులకు బిజెపి లేఖలు
టీఎస్పీఎస్సీ లీకేజీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీని ఆదేశించారు. అట్లాగే ‘‘చిన్న పొరపాటు లేకుండా కేంద్రం లక్షలాది ఉద్యోగాలను క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మరి కేసీఆర్ ఫ్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోంది. ఇదే అంశాన్ని విస్త్రంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టాలి’’ అని కోరారు.
లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దీంతోపాటు పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా ఉద్యమిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో తెలిపారు. త్వరలోనే వివిధ కోచింగ్ సెంటర్లతోపాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల్లోనూ పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
కాగా,డాక్టర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీ సభ్యులతో సంజయ్ తొలిసారిగా సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్ నిర్వహించే అంశంపై కార్యాచరణను వెంటనే రూపొందించాలని ఆదేశించారు. అందులో భాగంగా వారం రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది మందితో ‘‘నిరుద్యోగ మార్చ్’’ నిర్వహించాలని నిర్ణయించినందుకు వెంటనే ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇతర ఉమ్మడి జిల్లాల్లోనూ నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్‘‘ తేదీలను కూడా రెండ్రోజుల్లో ఖరారు చేయాలని చెప్పారు.
More Stories
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు!
జిహాద్ కు, అభివృద్ధికి మధ్య ఎన్నికలు
ఎంఐఎం, కాంగ్రెస్ లకు వేసే ఓటు నేరుగా పాకిస్థాన్కే