
కరోనా మహమ్మారి కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకూ 3వేల లోపు నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం ఆ సంఖ్య 4వేలకు దాటింది. కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా 24 గంటల వ్యవధిలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,31,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది. 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబర్ 25న 4,777 కేసులు వెలుగు చూశాయి.
సోమవారం కొత్తగా 3,038 కేసులు వచ్చాయి. తద్వారా భారత్లో కరోనా చాలా వేగంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది. తాజా కేసులతో దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 44,733,719కి చేరింది. ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
ఇక గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళ, మహారాష్ట్రలో నలుగురు చొప్పున, ఢిల్లీ, చత్తీస్గఢ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పుదుచ్ఛేరి, రాజస్థాన్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 5,30,916కి పెరిగింది. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.05 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలో కొత్తగా 711 కరోనా కేసులు వచ్చాయి. ఒక్క రోజులో అక్కడ కొత్త కేసులు 186 శాతం పెరిగాయి. అలాగే ఢిల్లీలో కొత్తగా 521 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు చెబుతున్నా.. కేసులు, మరణాలూ విపరీతంగా పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
More Stories
బీహార్ లో తొలగించిన 3.66 లక్షల ఓట్ల వివరాలు వెల్లడించండి
ఎవరెస్ట్పై మంచు తుఫానులో చిక్కుపోయిన వెయ్యి మంది
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్లో కర్ఫ్యూ