ప్రపంచ అత్యుత్తమ ప్రాంతాల జాబితాలో రెండు భారత పట్టణాలకు గుర్తింపు లభించింది. ఒడిశాలోని మయూర్భంజ్, కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ ఈ విశిష్టతను పొందాయి. 2023 ఏడాదికి టైమ్ మేగజైన్ రూపొందించిన ప్రపంచ టాప్-50 ప్రాంతాల జాబితాలో ఈ రెండు పట్టణాలు చోటు దక్కించుకున్నాయి.
అంతరించిపోతున్న పులులు, చారిత్రక దేవాలయాలు, అలాగే వారి సాహస చరిత్ర, వంటకాల పరంగా ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాకు ఎంపిక చేశారు. ఈ జాబితా ప్రస్తుత సమయంలో సుస్థిరత, ప్రామాణికత అనే రెండు పెద్ద ధోరణులను ప్రతిబింబిస్తుందని టైమ్స్ సీనియర్ ఎడిటర్ ఎమ్మా బార్కర్ పేర్కొన్నారు. ఈ జాబితాలోని అనేక స్థానాలు మరింత పరిమిత పర్యావరణ ప్రభావంతో పర్యాటకులను సందర్శించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి.
లడఖ్ ఆశ్చర్యకరమైన ప్రదేశంగా ఉంది. ఆల్ఫైన్ ప్రకృతి దృశ్యాలు, టిబెటన్ బౌద్ధ సంస్కృతి దీని ప్రత్యేకత. అలాగే, భారతదేశం తన మొదటి డార్క్ స్కై రిజర్వ్ను లడఖ్ రాజధాని లేహ్కు ఆగ్నేయంగా 168 మైళ్ల దూరంలో ఉన్న హన్లే గ్రామంలో ఏర్పాటు చేసింది.
ఇక గ్రిల్డ్ మాంసాలు, నాథూస్ స్వీట్లకు సంబంధించి గతేడాది ఆగస్టులో ఇక్కడ ఔట్లెట్లు తెరిచారు. రొయ్యల భోజనం కోసం సీ బక్థార్న్, ఫన్డ్యూ లేదా స్పైసీ ఫ్రైడ్ చికెన్ భోజనం కోసం కేఫ్ మోంటాగ్నే ఔట్లెట్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. లేహ్ నుండి 5 గంటల ప్రయాణంలో టుర్టుక్ విలేజ్కి వెళ్లే వారికి ఫార్మర్స్ హౌస్ కేఫ్ ప్రత్యేక ఆకర్షణ.ఇక మయూర్ గంజ్ గురించి చెప్పాలంటే, చాలా అరుదైన నల్లపులిని గుర్తించడానికి భూమిపై ఉన్న ఏకైక ప్రదేశం ఇదేనని టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ ఏప్రిల్లో, మయూర్భంజ్ ఛౌ, యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఆకర్షణీయమైన నృత్య ఉత్సవం వైభవంగా జరుగుతుంది అని ఈ పత్రిక నివేదించింది.
ఫ్రెంచ్ పాలినేషియాలోని టువామోటు ద్వీపసమూహం స్థానిక నివాసికి ఒక విదేశీ సందర్శకుడిని మాత్రమే అనుమతించే దిశగా కదులుతోంది. సాంస్కృతికంగా శక్తివంతమైన మహానగరంగా వికసించిన కొలంబియాలోని మెడెలిన్ నగరం మాదిరిగా ఇతర ప్రాంతాలు రూపాంతరం చెందుతున్నాయని టైమ్ మేజగైన్ పేర్కొంది.
More Stories
మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం
2040 నాటికి రొమ్ము క్యాన్సర్తో మిలియన్ మరణాలు
అనంత్నాగ్ లో మరో వలస కార్మికుడి కాల్చివేత