వివాదాస్పద మత గురువు, ‘వారిస్ పంజాబ్ దే’ ఖలీస్థానీ నేత అమృత్పాల్ సింగ్ అనుచరుడు లవ్ప్రీత్ తుఫాన్ను ఓ కేసులో అమృత్సర్ పోలీసులు అరెస్టు చేయడంతో రెచ్చిపోయిన వందలాది మంది అమృత్పాల్ అనుచరులు పోలీసులపైకి దండెత్తి వచ్చారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగిస్తూ వీరంగం సృష్టించారు.
వెంటనే లవ్ప్రీత్ను విడుదల చేయాలని, ఎఫ్ఐఆర్ కొట్టేయాలని డిమాండ్ చేశారు. అమృత్పాల్ సింగ్ కూడా పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. గంటలో ఎఫ్ఐఆర్ కొట్టివేయకపోతే తర్వాత జరిగే పరిణామాలకు యంత్రాంగమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమృత్సర్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకారుల గుంపును చూపించాయి. అయితే పోలీసులు జనాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు.‘కేవలం రాజకీయ ఉద్దేశ్యంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గంటలో కేసును రద్దు చేయకపోతే, తదుపరి ఏమి జరిగినా దానికి అడ్మిన్స్ట్రేషన్ బాధ్యత వహిస్తుంది’ అని హెచ్చరించాడు.
‘వారిస్ పంజాబ్ దే’ అనేది గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్త దీప్ సిద్దూ స్థాపించిన ర్యాడికల్స్ సంస్థ. జర్నేల్ సింగ్ బింద్రన్వాలా స్ఫూర్తిగా అమృతపాల్ సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నారు. బింద్రన్వాలా తరహాలో అమృత్పాల్ సింగ్ డ్రెస్ చేసుకొంటూ, టర్బన్ కూడా కట్టుకుంటూ ప్రత్యేక సిఖ్ దేశం కోసం పోరాడుతున్నాడు.
ఖలిస్తానీ ఉద్యమాన్ని అణిచివేస్తామని హెచ్చరించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇటీవల అమృత్ బెదిరించారు. ఇందిరా గాంధీ తరహాలోనే చంపేస్తామని హెచ్చరించాడు. పాకిస్థాన్ ఐఎస్ఐతో అమృత్పాల్ సింగ్కు ఏదైనా లింకు ఉందా అన్న కోణంలో భద్రతాదళాలు విచారణ కొనసాగిస్తున్నారు.
More Stories
కాశ్మీర్ లో పోలింగ్కు ముందు రెచ్చిపోయిన ఉగ్రవాదులు
దక్షిణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్