
ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణన్ మాథుర్ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.
న్యాయశాస్త్ర పట్టా తీసుకున్న సయ్యద్ అబ్దుల్ నజీర్ 1983లో లాయర్ గా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత అదే హైకోర్టులో ఆయన ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2017లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడే భారత సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. 2017లో సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ విశ్వాసాల బెంచ్లో నజీర్ ఏకైక ముస్లిం న్యాయమూర్తి. ఈ ఏడాది జనవరి 4న ఆయన పదవీ విరమణ చేశారు.
రామజన్మభూమి వివాద పరిష్కారంలో సుప్రీం కోర్టులో ఏర్పాటైన బెంచ్ లో కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ సభ్యుడుగా ఉన్నారు. అనంతరం ఆయన పదవీ విరమణ చేశారు. ఇక ప్రస్తుతం ఎపికి గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ ను చత్తీస్ గడ్ కు బదిలీ చేశారు. మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేశారు.
మహారాష్ట్ర గవర్నర్గా రమేశ్ బైస్ను నియమించింది. ఇప్పటివరకు రమేశ్ బైస్ ఝార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. వీరితోపాటు ఛత్తీస్గఢ్, బీహార్, హిమాచల్ప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్ గవర్నర్లకు స్థానచలనం కలిగింది.
కొత్త గవర్నర్లు: అరుణాచల్ ప్రదేశ్- లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ ; సిక్కిం- లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య; జార్ఖండ్- సీపీ రాధాకృష్ణన్; హిమాచల్ప్రదేశ్- శివ్ప్రతాప్ శుక్లా; అసోం- గులాబ్ చంద్ కటారియా; ఆంధ్రప్రదేశ్- రిటైర్డ్ జస్టీస్ ఎస్. అబ్దుల్ నజీర్; ఛత్తీస్గఢ్- బిస్వభూషణ్ హరిచందన్; మణిపూర్- అనసూయ; నాగాలాండ్- గణేషన్; మేఘాలయా- ఫగు చౌహాన్; బీహార్- రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్; మహారాష్ట్ర- రమేశ్ బైస్; లడఖ్- బీడీ మిశ్రా.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?