ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ నేతగా మోదీ

ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో అత్యంత జనాకర్షక నేతలపై నిర్వహించిన తాజా సర్వేలోనూ ప్రధాని మోడీ టాప్ లో నిలిచారు. గతంలో భారత్ తో పాటు అంతర్జాతీయంగా నిర్వహించిన పలు సర్వేల్లో అగ్రస్దానం సంపాదించిన మోడీ మరోసారి దాన్ని నిలబెట్టుకున్నారు. అంతర్జాతీయ సంస్ధ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన తాజా సర్వేలో మోదీ  ఏకంగా 75 శాతం మంది జనామోదంతో అగ్రస్దానంలో నిలిచారు.

 ప్రజాదరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను వెనక్కి నెట్టేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.  సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది మోదీకి తమ ఓటు వేశారు.

అయితే ఈ జాబితాలో అనూహ్యంగా అగ్రదేశాలుగా చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడన్, బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ చాలా వెనుక బడ్డారు. జో బిడెన్ ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు. నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్-యుల్, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా చివరి మూడు స్థానాల్లో ఉన్నారు.
 
తాజా సర్వేలో 78% మంది ప్రజలు ప్రధాని మోదీని ఆమోదించగా, 18% మంది ఆయనను తిరస్కరించారు. మోదీ ఆమోదం రేటింగ్ తాజాగా బాగా పెరిగి జనవరి మూడవ వారంలో 79%కి చేరుకుందని తెలిపారు. మొత్తం 22 దేశాలకు చెందిన ప్రజల నుంచి సర్వేలో భాగంగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రధాని మోదీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపెజ్ ఒబ్రాడర్, స్విస్ అధ్యక్షుడు అలెన్ బెర్సెట్ ఉన్నారు.

2023 జనవరి 26 నుంచి 31వ తేదీల మధ్య సమీకరించిన తాజా డేటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టు మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది. ప్రతి దేశం నుంచి వయోజనులు వారం రోజుల్లో ఇచ్చిన రేటింగ్ ల సగటు ఫలితాలు ఇవని పేర్కొంది. లోపెజ్ ఒబ్రాడర్ కు 68 శాతం ఓటింగ్ లభించగా, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఇద్దరూ 40 శాతం చొప్పున ప్రజాదరణతో నిలిచారు. భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు కేవలం 30 శాతం ప్రజాదరణ లభించింది.