ప్రదీప్ నాయక్ సూచన మేరకు హైదరాబాద్కు చెందిన జీత్ నాయక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి గుజరాత్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని తస్కరించి అతనికి చేరవేసినట్లు వెల్లడైంది. దాంతో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్కు చేరుకుని జీత్ నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీకేజీకి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా, ఈ కేసుకు సంబంధించి వడోదరకు చెందిన 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్) తెలిపింది. ఇందులో ఐదుగురు గుజరాత్కు చెందిన వారు కాగా, పది మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. నిందితులపై ఎటిఎస్ నిరంతరం నిఘా ఉంచిందని, పేపర్ లీక్ వెనుక అంతర్ రాష్ట్ర్ర ముఠా హస్తం ఉన్నట్లు తెలుస్తోందని ఎటిఎస్ పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ జోషి తెలిపారు.
మొత్తం 1181 పోస్టుల భర్తీ కోసం జరగాల్సిన జూనియర్ క్లర్క్ పరీక్షకు గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 9.5 లక్షల మంది దరఖాస్తు చేరుకున్నారు. వారిలో దాదాపు ఏడు లక్షల మందికి పైగా ఆదివారం పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. పేపర్ లీక్ అయిన జామ్నగర్లోనే దాదాపు 26 వేల పైచిలుకు అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా అర్ధాంతరంగా పరీక్ష ఆగిపోయింది.
More Stories
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొవిషీల్డ్ పై దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్