
జి-20 సభ్య దేశాల్లోని అంకుర సంస్థల సామర్థ్య వికాసానికి తోడ్పడే అంశాల్లో ఆచరణాత్మక మార్గనిర్దేశకాల రూపకల్పనకు ఉమ్మడి వేదికను చూపే ప్రయత్నం చేస్తున్నారు. అంకుర సంస్థలకు మద్దతు, కార్పొరేట్-పెట్టుబడిదారులు-ఆవి
ఈ బృందం ప్రధాన ధ్యేయం నిధుల లభ్యతలో అంతరాల గుర్తింపు, ఉపాధి అవకాశాల పెంపుదల, ఎస్డీజీ లక్ష్యాల సాధన, వాతావరణ ప్రతిరోధకతతోపాటు సమ్మిళిత పర్యావరణ వ్యవస్థ ఎదుగుదల వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఉండనుంది. ‘స్టార్టప్20’ బృందం చైర్మన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్, నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పరమేశ్వరన్ అయ్యర్ ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేశారు.
సహకారాత్మక, ముందుచూపుతో కూడిన ప్రపంచ అంకుర పర్యావరణ వ్యవస్థను సమన్వయీకరించడం స్టార్టప్20 ప్రధాన లక్ష్యం అని ప్రముఖులు పేర్కొన్నారు. భారత జి-20 షెర్పా అమితాబ్ కాంత్ స్టార్టప్20 చర్చల బృందం గురించి సంక్షిప్తంగా ప్రసంగించారు. కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సోమ్ప్రకాష్ కూడా ప్రసంగించారు.
ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు చూపే ఆవిష్కరణలు అనే అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ సంయుక్త కార్యదర్శి శ్రుతి సిన్హా తుది పలుకులతో సమావేశం ముగిసింది.
More Stories
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు