టిడిపికి చెందిన మాజీ మంత్రి నారాయణకు చెందిన కంపెనీలు, సంస్థల్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని మూడు చోట్ల సీఐడీ తనీఖీలు జరుగుతున్నాయి. మాదాపూర్లో ఉన్న రెండు కంపెనీలతో పాటు ఎన్ఎస్పీఐఆర్ఏ సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఎన్ఎస్పీఐఆర్ఏ కార్యాలయంలోని 40 కంప్యూటర్ హర్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో అక్రమంగా అసైన్డ్ భూముల కొనుగోలు జరిగినట్టు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విషయంలోనే సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. కాగా, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ నుంచి పెద్ద మొత్తంలో నిధులు బదిలీ అయినట్టు సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
ఎన్ఎస్పీఐఆర్ఏ సంస్థ నుంచి అసైన్ట్ భూములు కొనుగోలు జరిగనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హవాలా ద్వారా డబ్బులు బదిలీ అయినట్టుగా సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇదివరలో, ఏపీ రాజధాని అయిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.
2014 నుంచి 2019 మధ్య భూసేకరణలో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టుగా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదైంది.
ఏపీ సీఐడీ ఇప్పటికే ఈ కేసులో నోటీసులు జారీ చేయాగా మాజీ మంత్రి నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్లోని నివాసంలోనే నారాయణను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీకి సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే నారాయణ ఇంట్లోనే అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాగా.. ఇప్పుడు మరోసారి అధికారులు సోదాలకు దిగటం సంచలనంగా మారింది.
More Stories
అల్లు అర్జున్ పర్యటనతో నంద్యాల ఎస్పీపై వేటు
ఏపీలో పోలింగ్ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు
పోలింగ్ ముందు నగదు బదిలీకి జగన్ కు ఈసీ మోకాలడ్డు