కర్ణాటకలో మరోసారి హిందూ యువకుడి మీద ముస్లీం యువకుడు తల్వార్ తో దాడి చెయ్యడం కలకలం రేపింది. ఇప్పటికే అనేక మంది హిందూ కార్యకర్తలను పీఎఫ్ఐ కార్యకర్తలు హత్య చేశారని కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో హిందూ సంఘ సంస్థలు రగిలిపోతున్నాయి.
శివమొగ్గ జిల్లాలోని సాగర పట్టణంలో భజరంగ్ దళ్ కార్యకర్తపై తల్వార్ దాడి చేశారు. ఆ సందర్బంలో బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఆ సందర్బంలో భజరంగ్ దళ్ కార్యకర్త సునీల్ క్షణాల్లో తప్పించుకున్నాడు.
ప్రైవేట్ బస్టాండ్ సమీపంలోని లాడ్జి దగ్గర సమీర్ అనే ముస్లిం యువకుడు నిలబడి తల్వార్ ఊపుతుండగా బైక్ పై వచ్చిన సునీల్ బైక్ అడ్డగించాడు. ఆ సందర్బంలో సునీల్ మీద సమీర్ అనే యువకుడు తల్వార్ తాడి చేశాడు. చంపేస్తారని భయపడిన సునీల్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు.
శివమొగ్గలో జరిగిన శౌర్య పథ్ సంచలన్ అనే కార్యక్రమంలో సునీల్ పాల్గొన్నాడని, ఆదివారం కూడా కార్యక్రమంలో పాల్గొనడానికి వెలుతున్న సునీల్ మీద పక్కాప్లాన్ తో సమీర్ తల్వార్ తో దాడి చేశాడని తెలిసింది. సాగర్లోని నెహ్రూనగర్కు చెందిన సమీర్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సునీల్ మీద హత్యాయత్నం చేశాడని వెలుగు చూసింది.
సాగర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సునీల్పై దాడి నేపథ్యంలో సాగర్లోని నెహ్రూనగర్లోని నిందితుడు సమీర్ ఇంటి ముందు హిందూ సంఘాల కార్యకర్తలు గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సందర్బంలో సమీర్ ఇంట్లో లేడని పోలీసు అధికారులు అంటున్నారు.
కాగా, మూడు బృందాలను ఏర్పాటు చేసి ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని, కేసు విచారణలో ఉందని శివమొగ్గ జిల్లా ఎస్పీ మిథున్కుమార్ సోమవారం మీడియాకు చెప్పారు. సాగర్ టౌన్ పోలీస్స్టేషన్ ఎదుట హిందూ అనుకూల సంఘాల నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
మంగళవారం సాగర్ బంద్కు హిందూ సంఘ, సంస్థలు పిలుపునిచ్చారు. దాడికి యత్నించిన నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భజరంగ్ దళ్ తో పా హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా