అండమాన్ & నికోబార్ దీవులకు తన రెండు రోజుల పర్యటన చివరి రోజున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం దేశంలోని దక్షిణాది కొనగా చెప్పబడే ఇందిరా పాయింట్ని సందర్శించారు. ఆయన వెంట కమాండర్-ఇన్-చీఫ్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ (సిన్కాన్) లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ ఉన్నారు.
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ రక్షణ సన్నద్ధతను సమీక్షిస్తూ ఈ ప్రాంతంలో జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడాన్ని కొనసాగించాలంటూ మంద్రి దళాలను ప్రోత్సహించారు. ఇందిరా పాయింట్ గ్రేట్ ఛానల్ వెంబడి ఉంది, దీనిని ప్రముఖంగా ‘సిక్స్ డిగ్రీ ఛానల్’ అని పిలుస్తారు. ఇది అంతర్జాతీయ ట్రాఫిక్కు ప్రధాన షిప్పింగ్ లేన్.
సాయుధ దళాల బలమైన ఉనికి ఈ ప్రాంతంలో నికర భద్రతా ప్రదాతగా తన బాధ్యతను మరింత మెరుగ్గా నిర్వహించడానికి భారతదేశాన్ని సన్నద్ధం చేస్తుంది. మార్గ మధ్యలో రక్షణ మంత్రి కార్ నికోబార్ ద్వీపం, క్యాంప్బెల్ బే వద్ద ఆగారు. అక్కడ క్షేత్ర స్ధాయి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.
రక్షణ మంత్రి అండమాన్, నికోబార్ కమాండ్లోని జాయింట్ సర్వీసెస్ ట్రూప్లతో కూడా సంభాషించారు. సాటిలేని ధైర్యసాహసాలు, నిబద్ధతతో దేశానికి సేవ చేస్తున్నందుకు వారిని ప్రశంసించారు. రక్షణ మంత్రికి సదరన్ గ్రూప్ ఆఫ్ అండమాన్, నికోబార్ దీవుల భూభాగం గురించి బాగా తెలుసుకున్నారు.
ఆయన ఐఎన్ఎస్ బాజ్ను సందర్శించి, సైనికులతో సంభాషించారు. గురువారం, రక్షణ మంత్రి పోర్ట్ బ్లెయిర్లోని అండమాన్ & నికోబార్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ కమాండ్ కార్యాచరణ సంసిద్ధతను, కార్యాచరణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి సమీక్షించారు.
జనవరి 2019 తర్వాత ఇందిరా పాయింట్కి రక్షా మంత్రి రావడం ఇదే తొలిసారి. ఈ సుదూర ద్వీపాలు ఇండో-పసిఫిక్కు సమీపంలో ఉన్న దృష్ట్యా వ్యూహాత్మక సిగ్నలింగ్తో పాటు, ఏ&ఎన్ కమాండ్ను రక్షణ మంత్రి పర్యటన సుదూర, మారుమూల ద్వీపాలలో మోహరించిన దళాలకు ప్రేరణ కలిగించింది. ఏ&ఎన్ కమాండ్ 21 ఏళ్ల విజయవంతమైన ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అని పేర్కొనడం సముచితం, ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రణాళిక చేయబడింది.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మత ప్రాతిపాదక రిజర్వేషన్లు
అన్నామలైకి సుప్రీంకోర్టులో ఊరట
సెక్స్ రాకెట్ లో ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణపై వేటుకు సిద్ధం!