8 నుంచి ఇండోర్ లో ప్రవాసీ భారతీయ దివాస్ 

 
17వ ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సమావేశం జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరుగుతుంది. మొదటి రోజున యువ ప్రవాసి భారతీయ దివస్ నిర్వహిస్తారని భారత వలసదారుల మండలి అధ్యక్షుడు మంద భీంరెడ్డి తెలిపారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగింపు సమావేశంలో పాల్గొనే ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డులను బహుకరిస్తారు.
 
ఈ సందర్భంగా, ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీలలో డయాస్పోరా (ప్రవాసి) యువత పాత్ర అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షత వహిస్తారు.  మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరు రంగాలకు చెందిన వేరు వేరు సదస్సులును నిర్వహిస్తుంది.
 
రెండో రోజున ప్రవాసి భారతీయ దివస్ లో జరిగే డిజిటల్ ఎగ్జిబిషన్ లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. “భారతీయ ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడంలో భారతీయ డయాస్పోరా (ప్రవాసుల) పాత్ర: అమృత కాలం (రాబోయే 25 సంవత్సరాలు ) విజన్ @2047″ అనే అంశంపై చర్చాగోష్టి కి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహిస్తారు.
 
“భారతదేశపు సాఫ్ట్ పవర్ (మృదువైన శక్తిని) ఉపయోగించుకోవడం – హస్తకళలు, వంటకాలు & సృజనాత్మకత ద్వారా సద్భావన” అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి అధ్యక్షత వహిస్తారు.   ప్రస్తుతం జి-20 దేశాల సమాఖ్యకు భారతదేశం అధ్యక్షత వహిస్తున్నది. అమితాబ్ కాంత్, హర్షవర్ధన్ శృంగల అనే ఇద్దరు జి-20 ఇంచార్జి అధికారులు మరొక సదస్సులో ప్రసంగిస్తారు.
 
మూడో రోజున ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. “భారతీయ శ్రామిక శక్తి ప్రపంచ చలనశీలతకు అవకాశం ఇవ్వడం – భారత ప్రవాసుల పాత్ర” అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర విద్య, నైపుణ్య అభివృద్ధి, పారిశ్రామిక శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహిస్తారు.
 
“ప్రవాస మహిళా పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని దేశ నిర్మాణానికి సమ్మిళిత విధానంలో ఉపయోగించడం” అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయి పటేల్ మధ్యాహ్న భోజన విందు ఇస్తారు.