మిస్డ్ కాల్‌తో రైతులు బ్యాంకు రుణం

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు  రైతులకు మరింత సులభంగా రుణాలు అందించేందుకు సిద్ధం అవుతోంది. కేవలం మిస్డ్ కాల్ ద్వారా రైతులు తమ బ్యాంకు నుండి రుణం పొందొచ్చని వెల్లడించింది. బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియచేసింది.  

రైతులు వివిధ మార్గాల్లో బ్యాంక్ నుంచి రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ పంపండం, లేదంటే మిస్డ్ కాల్ ఇవ్వడం, నెట్ బ్యాంకింగ్, పీఎన్‌బీ వన్ వంటి వాటి ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.  లోన్ అని టైప్ చేసి 56070 అనే నెంబర్2కు ఎస్ఎంఎస్ పంపొచ్చు. 

లేదంటే 18001805555 నెంబర్‌కు మిస్డ కాల్ ఇవ్వొచ్చు. అలాగే 18001802222 అనే కాల్ సెంటర్ నెంబర్‌కు కూడా కాల్ చేయొచ్చు. ఈ ఆప్షన్లు కాకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు  చేసుకోవచ్చు.  లేదంటే పీఎన్‌బీ వన్ అనే యాప్‌ను బ్యాంక్ అందిస్తోంది. ఈ యాప్‌లోకి లాగిన్ అయ్యి లోన్ కోసం అప్లై చేయొచ్చు. అర్హత కలిగిన బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ఈ  ప్రయోజనాలు వర్తిస్తాయని గుర్తించుకోవాలి.

మరోవంక, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్  క్రెడిట్ కార్డు పధకం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులకు బ్యాంకులు రూ. 3 లక్షల వరకు రుణాలు అందిస్తున్నాయి. ఇంకా వడ్డీ రాయితీ ప్రయోజనం కూడా లభిస్తుంది. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించే రైతులు కేవలం 4 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి చెప్పుకోవచ్చు. 

కేంద్ర ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీతో కలుపుకుంటే రైతులకు 7 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే 3 శాతం తగ్గింపు వస్తుంది. అంటే కేవలం 4 శాతం వడ్డీకే రుణం పొందొచ్చని చెప్పుకోవచ్చు. బ్యాంకులు అన్నీ కూడా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు అందిస్తున్నాయి. వీటిని కేసీసీ లోన్స్ అని కూడా పిలుస్తుంటారు