ఐదు రోజుల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ లో విడిది

శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 30 వరకు ద్రౌపది ముర్ము రాష్ట్రంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
మధ్యాహ్నం 3.05 నుంచి 3.15 గంటల వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని యుద్ధస్మారకం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం వీరనారీలను సత్కరిస్తారు. రాత్రి 7.45 గంటలకు రాజ్‌భవన్‌లో విందు కార్యక్రమంలో పాల్గొంటారు.28న భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి ఆలయం, రామప్ప గుడికి వస్తున్నారు.

డిసెంబర్‌ 26న మధ్యాహ్నం 3.05 – 3.15 సికింద్రాబాద్ బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి. వీరనారీలకు సత్కారం.
డిసెంబర్ 27న ఉదయం 10.30 – 11.30 నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం
డిసెంబర్‌ 27న మధ్యాహ్నం 3.00- 4.00 సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మాల్దీవులు తదితర దేశాల అధికారులతో సమావేశం
డిసెంబర్‌ 28న ఉదయం 10.40 – 11.10 భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ సందర్శన. ప్రసాద్ పథకం ప్రారంభం. అనంతరం మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(మిథాని)కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు.
డిసెంబర్‌ 28న మధ్యాహ్నం 3.00-3.30 వరంగల్‌లోని రామప్ప ఆలయ సందర్శన. ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభం
డిసెంబర్‌ 29న ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం.
డిసెంబర్‌ 29న సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి (శ్రీ రామానుజాచార్య) విగ్రహ సందర్శన
డిసెంబర్ 30న ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కాన శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగం. అనంతరం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభం.
డిసెంబర్‌ 30న మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విందు ఏర్పాటు చేస్తారు.