భారత్ సూపర్‌ పవర్ అయితీరుతుంది

భారతదేశం త్వరలోనే సూపర్ వపర్ అవుతుందని, అమెరికాతో మిత్రదేశపు స్థాయిని మించిపోతుందని వైట్‌హౌస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. భారతదేశం ఓ మహత్తర శక్తి అయ్యే లక్షణాలు మెండుగా ఉన్నాయని, అత్యంత విశిష్టమైన వ్యూహాత్మక వైఖరిని సంతరించుకున్న దేశం స్థాయిని తక్కువగా పరిగణించలేమని వైట్‌హౌస్ నుంచి ఆసియా వ్యవహారాల పర్యవేక్షక సమన్వయకర్త కర్ట్ కాంప్‌బెల్ స్పష్టం చేశారు.
వ్యూహాత్మక భద్రతా విషయాల సంబంధిత అస్పెన్ సెక్యూరిటీ ఫోరం సమావేశాలలో కాంపెబెల్ ఓ ప్రశ్నపై స్పందించారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత 20 ఏళ్లల్లో శరవేగంతో వృద్ధి చెందాయని, ఇతర ఏ దేశంతో పోల్చుకోలేని రీతిలో ఈ సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవడానికి చైనా పట్ల పరస్పరం గల ఆందోళనలు మాత్రమే కారణం కాదని చెప్పారు.
21వ శతాబ్ధంలో అమెరికాకు భారత్ నే అత్యంత ప్రాధాన్యత గల మిత్రదేశం అవుతుందని, ఇప్పటి మిత్రదేశం భారత్ ఇకపై గొప్ప శక్తివంత దేశం అవుతుందని స్పష్టం చేశారు. ఇది భారత్ పట్ల తన ఆలోచన అని వివరించారు. ఇరుదేశాల మధ్య స్నేహం ఇంతకాలం పటిష్టంగా నిలవడానికి కారణాలు ఏమిటనేవి తాను విశ్లేషించలేనని తెలిపారు.

భారత్‌లో అమెరికా మరిన్ని పెట్టుబడులకు దిగుతుంది. దీనికి పరిమితి ఉండదు, ఇదే విధంగా ప్రజల మధ్య సంబంధాలు ఇనుమడింప చేసుకోవడం , సాంకేతిక శాస్త్రీయ ఇతర రంగాలలోకలిసికట్టుగా సాగడం వంటికీలక పరిణామాలు ఉంటాయని వివరించారు. గత రెండు దశాబ్దాలలో భారత్, చైనా అనేక అవరోధాలను అధిగమిస్తూ వివిధ రంగాలలో సంబంధాలను ఏర్పర్చుకోగలుగుతున్నాయని ఆయన చెప్పారు. 

ఇండో-పసిఫిక్‌లోని భౌగోళిక రాజకీయ పరిస్థితిపై, వైట్‌హౌస్ అధికారి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనలను ప్రేరేపించాయి. “స్పష్టంగా, చైనా గణనీయమైన పెరుగుదల, దాని అర్థం ఏమిటి, కానీ అమెరికా సాపేక్ష అనూహ్యత ఆసియాలో ప్రభావం చూపుతుంది.”

“ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పోటీ, నిశ్చితార్థం భాగం ఎక్కువగా సాంకేతికత, ప్రజాస్వామ్య సాధనలో ఉంటుందని మేము గుర్తించాము, దీనిలో అమెరికా ఒకప్పుడు ఆధిపత్య స్థానాన్ని కలిగి ఉంది” అంటూ బిడెన్ ప్రభుత్వ వైఖరిని వివరించారు.