ఇప్పటికే ఐదు వందే భారత్ రైళ్లు పట్టాలు ఎక్కగా దక్షిణ మధ్య రైల్వేకు కూడా ఓ రైలును కేటాయించని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ నిర్ధారించారు. ఈ రైలు గరిష్ఠ వేగం 180 కిలోమీటర్లు. రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రైలులో సీట్లు మాత్రమే ఉంటాయి, బెర్తులు ఉండవు.
తొలుత సికింద్రాబాద్-విజయవాడ మధ్య వచ్చే ఏడాది ప్రారంభంలో నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మున్ముందు బెర్తులతో కూడిన వందే భారత్ రైళ్లు రానున్నాయి. అప్పుడు విశాఖ వరకు పొడిగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్-వి
ఈ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కాజీపేట మీదుగా కాగా, రెండోది నల్గొండ మీదుగా. కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ఠ వేగం 130 కిలోమీటర్లు కాగా, నల్గొండ మార్గంలో ఇది 110 కిలోమీటర్లుగా ఉంది. దీంతో వందే భారత్ రైలు కోసం ట్రాక్ సామర్థ్యాన్ని 180 కిలోమీటర్లకు పెంచాల్సి ఉంటుంది. త్వరలోనే ట్రాక్ అప్గ్రేడ్, సిగ్నలింగ్, ఇతర పనులు చేపట్టే అవకాశం ఉంది.
More Stories
వడ్ల కొనుగోలు వేగవంతం చేయండి రేవంత్
మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థిని అరెస్ట్ చేసి విచారణ జరిపించండి
తెలంగాణ కేబినెట్ సమావేశానికి అనుమతివ్వని ఈసీ