ఇన్ స్టాగ్రామ్ మూగదని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా ట్విట్టర్ను ఉత్తమ సోషల్ మీడియాగా చెప్పుకొచ్చిన కంగనా… ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మూగది అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.
ఇన్ స్టా అంతా ఫొటోల మయమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు ట్విట్టర్ ను ఉత్తమ సోషల్ మీడియా వేదికగానూ ఆమె అభివర్ణించింది. మేధోపరంగా, సైద్ధాంతికంగా ప్రేరేపించేదంటూ ఆమె పేర్కొన్నారు.
‘ఇన్స్టాగ్రామ్ ఒక మూగది. ఇందులో ఫొటోలు తప్ప ఏమీ ఉండవు. ఎవరైనా ఏదైనా అభిప్రాయం రాసినా అది మరుసటి రోజుకు మాయమైపోతుంది. కొందరు ఉంటారు. వారు చెప్పేదానికి ఎలాంటి అర్థం ఉండదు. వారి సందేశం అదృశ్యమైనా వారేం పట్టించుకోరు. కానీ మాలాంటి వారి పరిస్థితి ఏంటి..?’ అంటూ ఆమె ప్రశ్నించారు.
ట్విట్టర్ పాలసీ సమీక్ష తర్వాత నిషేధానికి గురైన వారిని అనుమతిస్తామంటూ ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటన చేయడంతో కంగనాలో కొత్త ఊపిరి వచ్చినట్టుంది. తాను తిరిగి ట్విట్టర్ పైకి రావాలని భావిస్తున్నట్టు ఆమె ఇప్పటికే ఆసక్తి వ్యక్తం చేసింది.
కంగనా రనౌత్ తాజా ఇన్ స్టా స్టోరీస్ పోస్ట్ ను పరిశీలిస్తే.. ‘‘మూగ ఇన్ స్టా గ్రామ్ అంతా ఫొటోలే. ఎవరైనా తమ అభిప్రాయం రాస్తే తదుపరి రోజు కనిపించదు. తాము క్రితం రోజు ఏం రాశామో చూసుకోకూడదని అనుకునే వారికి ఓకే. ఎందుకంటే వారు ఏం చెబుతున్నారో వారికే అర్థం కానప్పుడు అది అదృశ్యం కావాలి కదా..” అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
“కానీ, మాలాంటి వారి పరిస్థితి ఏంటి చెప్పే ఆలోచన డాక్యుమెంట్ అవ్వాలంటే, వాణిని లోతుగా వినిపించాలంటే .. ’’ అంటూ ఆమె రాసుకొచ్చారు.
More Stories
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
అమేథిలో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది