జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్పై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు అందడంతో ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటం లో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కూల్చేయడంతో జనసేన సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలాలు ఇచ్చారని కోపం తోనే వారి ఇల్లు కూల్చారని జనసేన ఆరోపించింది. ఇల్లు కోల్పోయిన వారిని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటంకు వెళ్లారు. ఈ సందర్భంగా అడ్డుకున్న పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు పవన్.
తనను ఆపే ప్రయత్నం చేయడంతో పవన్ పార్టీ కార్యాలయం నుంచి కాలి నడకన ఇప్పటం వెళ్లే ప్రయత్నం చేశారు. ఆపై కారు పైకి ఎక్కి ప్రయాణించారు. కారు వేగంగా దూసుకుపోతున్నా కూడా ఆయన కాళ్లు బారజాపుకుని అలానే కూర్చిండి పోయారు. ఈ సందర్భంగా తెనాలి మారీస్ పేటకు చెందిన పి. శివకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
ఈ నెల 5న ఇప్పటం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి బైక్పై వెళ్తుండగా పవన్ కళ్యాణ్ కారణంగా ప్రమాదానికి గురయ్యానని పోలీసులకు శివకుమార్ ఫిర్యాదు చేశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీఎస్ 07 సీజీ 2345 కారు టాప్పై కూర్చొని ఉండగా, మరికొందరు దానికి వేళాడుతూ కనిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ కారు వెనుక మరికొన్ని వాహనాలు అత్యంత వేగంగా దూసుకెళ్లడంతో ఆ వేగానికి తన బైక్ అదుపుతప్పి కింద పడిపోయానని శివకుమార్ ఫిర్యాదు చేశాడు. అజాగ్రత్తగా, అతివేగం, నిర్లక్ష్యంతో పాటు ప్రజలకు ప్రమాదం కలిగేలా కారు నడిపిన డ్రైవర్తో పాటు కారు టాప్పై కూర్చున్న పవన్ కళ్యాణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్థించాడు.
శివ కుమార్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పవన్ కళ్యాణ్తో పాటు కారు డ్రైవర్పై కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 279, 336తో పాటు మోటార్ వెహికిల్ యాక్ట్ లోని 177 సెక్షన్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
More Stories
ఏపీ అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు
`ఇంటింటి ప్రచారం’కు ముందస్తు అనుమతి నిబంధన నిలిపివేత
ఏపీలో ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి!