మన సైనికులకు తుపాకులు కాల్చడంతో పాటు ఇక నుండి మార్షల్ ఆర్స్ట్లో కూడా శిక్షణ ఇవ్వనున్నారు. కరాటేలో ఉన్న 15 నుంచి 20 రకాల కఠినమైన శిక్షణను తీసుకుంటున్నారు. ఐటీబీటీకి చెందిన సైన్యం కరాటేలో టెక్నికల్ శిక్షణను తీసుకుంటున్నారు.
2020 గాల్వాన్ ఘటనలో చైనాతో భారత ఆర్మీ ఎదుర్కొన్న విషాధ సంఘటనను ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజిపి ఈశ్వర్ సింగ్ తెలిపారు. శత్రువులను మట్టి కరిపించేలా జూడో, కరాటేలో మూడు నెలలపాటు ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.ఈ నిరాయుధ పోరాట రీతుల్లో తమనుతాము రక్షించుకోవడంతోపాటు ఎదురుదాడి చేసే నైపుణ్యాన్ని కూడా నేర్పిస్తారు
గుద్దడం, తన్నడం, విసిరేయడం, జాయింట్ లాక్, పిన్నింగ్ వంటి వాటితో ఊపిరాడకుండా చేయడమే లక్ష్యం. గత సంవత్సరమే మాజీ డీజీపీ సంజయ్ ఆరోరా ఈ శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. చండీగర్కు 25 కిలోమీటర్ల పరిధిలో పంచకులలోని భానులో కరాటే శిక్షణ ఇస్తున్నారు.
2020లో లడక్లో నిఘా పోస్టును ఏర్పాటు చేయడాన్ని నిరసించిన తరువాత చైనా సైన్యం భారత్పై క్రూరమైన పద్ధతిలో దాడులకు దిగింది. రాళ్లతో కొట్టడం, ముల్లులు ఉన్న లాఠీలు, ఇనుప రాడ్లు వంటి వాటితో దాడులు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 20 మంది భారత సైన్యం మృతిచెందారు.
అయితే భారత్ సైన్యం చేతిలో ఎవరూ చనిపోలేదని పేర్కొంది. రష్యన్ చెందిన టాస్ న్యూస్ ఏజెన్సీ చైనా సైనికులు 45 మంది వరకు గాల్వాన్లో చనిపోయినట్లు, అమెరికన్ ఇంటలిజెన్స్ రిపోర్టులో 35 మంది చైనా సైనికులు చనిపోయినట్లు పేర్కొంది.
ప్రత్యర్థిని పవర్ పంచ్తో భూమిపై మట్టి కరిపించేలా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శారీరక దృఢత్వంతో సైన్యం వాస్తవవాదీన రేఖ వెంట ఉన్న సైన్యం శక్తివంతంగా ఉండేలా ఆక్సిజన్ లెవల్ను తట్టుకునేలా, మంచు కొండల్లో తమను తాము రక్షించుకునేలా శిక్షణ ఇస్తున్నారు. 90 రోజుల్లో శిక్షణ పూర్తి చేసేలా తయారు చేసినట్లు చెప్పారు.
More Stories
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ మృతుల సంఖ్య 10
అమిత్ షాపై నకిలీ వీడియో.. ముంబైలో 16 మందిపై కేసు