‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను విడుదల చేసిన బీజేపీ

బీజేపీ సోషల్‌ మీడియా విభాగం వినూత్నంగా రూపొందించిన ‘‘ఆ ఒక్క అడక్కు’’ పోస్టర్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ విడుదల చేశారు.
 మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలోముఖ్యమంత్రి కేసీఆర్‌ 8 ఏండ్ల పాలనలోని ప్రజావ్యతిరేక విధానాలను, ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ఎండగడుతూ సోషల్‌మీడియా విభాగం వినూత్నంగా, ప్రజలను ఆకర్షించేవిధంగా పోస్టర్లను రూపొందించడాన్ని వారు అభినందించారు.
కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ రూపొందించిన ‘‘ఆ ఒక్క అడక్కు’’ పోస్టర్లను సోషల్‌ మీడియా అన్నీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని వారు కోరారు.
 
• చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్‌, కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• ఆకుపచ్చ మునుగోడును చేస్తా, కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• రైతులకు ఉచిత ఎరువులు, కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• దళిత ముఖ్యమంత్రి, కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• ఇంటికో ఉద్యోగం, కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• నిరుద్యోగభృతి, కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• ఫీజు రీయంబర్స్‌మెంట్‌, కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• ఎంబీసీలకు ప్రతీ బడ్జెట్‌లో వెయ్యికోట్లు.. కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనులు.. కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• కొత్త ఆసరాఫించన్లు.. కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు,
• మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు.. కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు,
• ఉద్యమకారులకు రాజకీయ అవకాశాలు.. కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు,
• బీసీలకు ఆత్మగౌరవ భవనాలు..  కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు,
• ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు.. కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్‌…  కేసీఆర్‌ – ఆ-ఒక్కటీ అడక్కు,
• రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ… కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు,
• గ్రామ పంచాయతీకి 20 లక్షలు… కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు,
• జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు.. కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• పంటకు కనీస మద్దతు ధర… కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• మూసీ ప్రక్షాళన.. కేసీఆర్‌- ఆ ఒక్కటీ అడక్కు
• జిల్లా కేంద్రాల్లో సూపర్‌స్పెషాల్టీ హాస్పిటల్‌… కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
• రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.. కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
 
బీజేపీలో చేరిన పసుపు రైతుల ఐక్య వేదిక నాయకులు

నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల ఐక్య వేదిక నాయకులు పెద్ద ఎత్తున  బీజేపీలో చేరారు. మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు.
తరుణ్ చుగ్, బండి సంజయ్ వీరికి కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన 25 మంది పసుపు రైతులు వీరిలో ఉన్నారు. వీరితోపాటు దాదాపు 900 మంది రైతులు ఈరోజు బీజేపీలో చేరినట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు.