మహీంద్రా ట్వీట్ సారాంశం ఏంటంటే.. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన వేళ భారతీయ నాయకులూ అందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, నాయకుల్లో తక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయంటూ విన్స్టన్ చర్చిల్ అవహేళన చేశారు.
కానీ భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన సమాధానం చెప్పారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అంటూ ఆనంద్ మహీంద్రా తన ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, సోమవారంనాడు ప్రధానిగా ఎన్నికైన అనంతరం రిషి సునాక్ తొలిసారి మాట్లాడుతూ, బ్రిటన్ చాలా గొప్ప దేశమని, ఆర్థిక సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటామనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు. దేశానికి ప్రస్తుతం సుస్థిరత, ఐక్యత అవసరమని, పార్టీని, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు తాను తొలి ప్రాధాన్యమిస్తానని చెప్పారు.
దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, మన పిల్లలు, మనుమలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించేందుకు సుస్థిరత, ఐక్యతే ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రజాసేవకు అహరహం శ్రమిస్తానని వాగ్దానం చేశారు. తాను ఒక హిందువుగా గర్విస్తున్నట్టు చెప్పారు.

More Stories
నాలుగు లేబర్ కోడ్ ల అమలు స్వాగతించిన బిఎంఎస్
శాంతి, సామరస్యం, పురోగతి కోసం ఐక్యత, వ్యక్తిత్వ నిర్మాణం
కశ్మీర్ ఆసుపత్రుల కింద ఆయుధ డంప్కు కుట్రలు