నడ్డాకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. శుక్రవారం మలక్ పేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బిజెపి కార్యాలయాన్ని మాజీ రాష్ట్ర అధ్యక్షుడు  ఇంద్రసేనారెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ కెసిఆర్ కారణంగానే దేశంలో అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని విమర్శించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నడ్డాకు సమాధి కట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు కేసీఆర్ ఉద్దేశం ఏమిటో మునుగోడులో టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పకనే చెప్పారని విమర్శించారు.
మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం కేసీఆర్ వందల‌ కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల కోసం కాకుండా తన కుటుంబం కోసమే మాత్రమే కేసీఆర్ పనిచేస్తున్నట్లు జోషి మండిపడ్డారు. కేసీఆర్ కారణంగా దేశంలోనే అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని విమర్శించారు.
 
కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు లొంగిపోయాయని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. పార్టీ పేరును బీఆర్ఎస్ గా కాకుండా తెలంగాణ రావు సమితిగా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు లొంగిపోయాయని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.