భారత ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి ప్రపంచ నేతల వరకు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులు , బిజెపి నేతలైతే వినూత్నంగా విషెష్ చెపుతూ తమ అభిమానాన్ని , ప్రేమను చాటుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మోదీకి తనదైన శైలిలో విషెష్ చెప్పి వార్తల్లో నిలిచారు. ఒడిశా పూరీ బీచ్లో ఒక వెయ్యి 213 మట్టి టీ కప్పులను ఉపయోగించి మోదీ చిత్రాన్ని రూపొందించారు. అందులో హ్యాపీ బర్త్డే మోదీ అని రాసుకొచ్చారు.
5 ఫీట్ల పొడవున్న మోదీ ఆకృతి కోసం పట్నాయక్ 5 టన్నుల ఇసుక వాడారు. మోదీ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక మోదీ బర్త్ డే సందర్భాంగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.
ఏపీ సీఎం జగన్, టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపేందుకు, దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షును భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. దేశానికి మోదీ మరింత కాలం సేవ చేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ