12 నుండి సంజయ్ 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఆరంభమై ఆ 12న ఈ మొత్తం 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఆదివారం యాత్ర షెడ్యూల్ ను ఖరారు చేశారు. 
 
 4వ విడతలో భాగంగా మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115.3 కి.మీల మేర పాదయాత్ర కొనసాగుతుంది. 12న కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించనున్న సంజయ్ 22న  ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగించనున్నారు. 
 
ఈనెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు హాజరు కానున్న నేపథ్యంలో ఆ రోజు పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది.