కేరళ మంత్రి సాజీ చెరియన్ మంగళవారం రాజ్యాంగానికి వ్యతిరేకంగా కఠినమైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. ప్రతిపక్షాలు ఆయనని తొలగించాలని డిమాండ్ చేయడంతో రాష్ట్రంలో భారీ రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే ఆ వామపక్ష నాయకుడు తరువాత విచారం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయనను మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని ప్రతిపక్షం కోరగా, అధికార సీపీఎం ఆ డిమాండ్ను తిరస్కరించింది. స్థానిక టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన విజువల్స్ ప్రకారం మంత్రి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో దేశ రాజ్యాంగం “దోపిడీని మన్నిస్తుంది”, దేశ ప్రజలను “దోపిడీ” చేయడానికి సహాయపడే విధంగా వ్రాయబడింది’’ అని పెక్రోన్నారు.
దీనిపై విపక్షాలు ఆయనను ఎల్డీఎఫ్ కేబినెట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. దానికి కేరళలోని ప్రభుత్వం ఆయన నోరు జారారని, అంతమాత్రానికే రాజీనామా చేయాలని కోరడం సరికాదని సర్ది చెప్పింది. తర్వాత చెరియన్ కూడా ‘‘నేనో ప్రభుత్వ సర్వెంట్ ను. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని. రాజ్యాంగాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో నేను ఏమి చెప్పలేదు’’ అని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!